'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' ట్రైలర్!

Published : Apr 12, 2019, 02:49 PM IST
'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' ట్రైలర్!

సారాంశం

2012లో బాలీవుడ్ లో వచ్చిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది.

2012లో బాలీవుడ్ లో వచ్చిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ఒరిజినల్ చిత్రంలో వరుణ్ ధావన్, అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రాలు నటించగా.. ఇప్పుడు సీక్వెల్ లో టైగర్ ష్రాఫ్, అనన్య పాండే, తారా సుతారియా నటిస్తున్నారు.

ఇక కథ విషయానికొస్తే.. పేరుగాంచిన ఓ కాలేజ్ లో టైగర్, అనన్య, తారా సుతారియాలకు సీట్లు వస్తాయి. అక్కడ హీరోకి ఓ సంపన్న కుటుంబానికి చెందిన కుర్రాడితో గొడవలు వస్తాయి. ఈ క్రమంలో టైగర్ ని కాలేజ్ నుండి బయటకి పంపించేస్తారు.

ఆ తరువాత ఎలాగైనా.. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' ట్రోఫీ సాధించాలని టైగర్ మళ్లీ అదే కాలేజ్ లో అడుగుపెడతాడు. ఆ తరువాత ఏం జరిగిందనే కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించారు. పునీత్ మల్హోత్రా డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మే 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Jamuna Rani Death: ఎస్. జానకి తర్వాత మరో విషాదం.. ప్రముఖ గాయని జమునారాణి కన్నుమూత!
Madhampatty Rangaraj: డీఎన్ఏ టెస్ట్‌తో బయటపడ్డ నిజం, ఆమె బిడ్డ ఆ సెలెబ్రిటీ కొడుకే.. ఫలించిన తల్లి పోరాటం