శ్రీనువైట్ల.. షాక్ ఇవ్వబోతున్నాడా..?

By Udayavani DhuliFirst Published Nov 3, 2018, 3:00 PM IST
Highlights

ఒకప్పటి స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్లకి వరుస ఫ్లాప్ సినిమాలు రావడంతో అతడి క్రేజ్ బాగా తగ్గిపోయింది. హీరోలు కూడా అతడితో సినిమాలు చేయడానికి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఛాన్స్ సంపాదించి షాక్ ఇచ్చాడు. రవితేజ హీరోగా 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాను తెరకెక్కించాడు. 

ఒకప్పటి స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్లకి వరుస ఫ్లాప్ సినిమాలు రావడంతో అతడి క్రేజ్ బాగా తగ్గిపోయింది. హీరోలు కూడా అతడితో సినిమాలు చేయడానికి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఛాన్స్ సంపాదించి షాక్ ఇచ్చాడు. రవితేజ హీరోగా 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాను తెరకెక్కించాడు. అయితే అటు రవితేజకి ఇటు శ్రీనువైట్లకి ఫ్లాప్ లు ఉండడంతో ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేకుండా పోయాయి. ఆశించిన స్థాయిలో సినిమా బిజినెస్ కూడా జరగడం లేదని సమాచారం. ఇదంతా పక్కన పెడితే.. శ్రీనువైట్ల ఈ సినిమాతో ఆడియన్స్ కి పెద్ద షాక్ ఇస్తాడని అంటున్నారు. సాధారణంగా శ్రీనువైట్ల సినిమాలలో కథాబలం కాకుండా కేవలం సన్నివేశాలతో కామెడీ పంచుతుంటాడు. విలన్ లను బకరా చేసుకొని ఆదుకోవడం ఇలాంటివే చూస్తుంటాం. కానీ ఈసారి ఆ అంశాలను టచ్ చేయడం లేదని తెలుస్తోంది. 
తొలిసారి థ్రిల్లర్ తరహా కథను ఎంపిక చేసుకున్నాడు. తన పాత సినిమా షేడ్స్ ఇందులో కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాడని తెలుస్తోంది. ఈ మధ్య వచ్చిన టీజర్ కూడా సీరియస్ గానే సాగింది. సినిమా కూడా అలానే సాగుతుందని అంటున్నారు. కథకి ప్రాముఖ్యతనిస్తూ స్క్రీన్ ప్లే లో ట్విస్ట్ లు కూడా ఉంటాయని తెలుస్తోంది. మరి ఈ కథైనా.. శ్రీనువైట్లకి కలుసొస్తుందేమో చూడాలి!   

ఇది కూడా చదవండి.. 

అయ్యో.. రవితేజ సినిమాకి బయ్యర్లు లేరే..!

click me!