శ్రీరెడ్డి పోస్ట్.. టార్గెట్ దగ్గుబాటి ఫ్యామిలీ!

By Udaya DFirst Published Feb 26, 2019, 11:21 AM IST
Highlights

మొన్నామధ్య తమిళంలో సినిమా ఆఫర్ రావడంతో చెన్నైకి వెళ్లిన శ్రీరెడ్డి కొద్దిరోజులు పాటు తన ఆరోపణలను పక్కన పెట్టింది. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ అయిపోయిందో ఏమో మళ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం మొదలెట్టింది. 

మొన్నామధ్య తమిళంలో సినిమా ఆఫర్ రావడంతో చెన్నైకి వెళ్లిన శ్రీరెడ్డి కొద్దిరోజులు పాటు తన ఆరోపణలను పక్కన పెట్టింది. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ అయిపోయిందో ఏమో మళ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం మొదలెట్టింది.

రీసెంట్ గా కొరటాల శివని టార్గెట్ చేస్తూ కామెంట్ చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీ మీద పడింది. హీరోయిన్ త్రిషని రానా ముద్దు పెట్టుకుంటున్న ఫోటోని, తనను అభిరామ్ ముద్దాడుతున్న ఫోటోని కలిపి పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. ఈ రెండు ఫోటోలు పెట్టి దగ్గుబాటి ఫ్యామిలీని తిట్టిపోసింది. 

''పరువులు, ఫ్యామిలీస్, పర్సనల్స్, బుద్ధి, జ్ఞానం, భక్తి అని మాట్లాడే సురేష్ బాబు గారు పిల్లల్ని పెంచి ఊళ్లో అమ్మాయిల మీదకు వదుల్తారా? సరసాల్లో చనిపోయిన మీ తాతని మించిపోయారు వారసులు. వీటన్నింటికీ అడ్డా రామానాయుడు స్టుడియోస్'' అంటూ పోస్ట్ లో రాసుకొచ్చింది.

ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రివర్స్ లో శ్రీరెడ్డిని తిట్టిపోస్తున్నారు. మీ ఇంట్లో వాళ్లు నిన్ను ఇలానే పెంచారా అంటూ కౌంటర్లు వేస్తున్నారు. 

 

click me!