మహేష్ కోసం స్పెషల్ ట్రైన్ సెట్!

By AN TeluguFirst Published Jul 5, 2019, 11:35 AM IST
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. 

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ట్రిప్ లో ఉన్న మహేష్ బాబు త్వరలోనే ఈ సినిమా సెట్స్ లో పాల్గొనున్నాడు. దర్శకుడు అనీల్ రావిపూడి తనదైన స్టైల్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కించనున్నాడు.

ఈ సినిమాలో ట్రైన్ కామెడీ ఎపిసోడ్ ఒకటి ఉందట. దానికోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. కాశ్మీర్ లో మిలిటరీ దళంలో పనిచేసే హీరో.. అంధ్రకు ట్రైన్ లో బయలుదేరతాడట. ఆ సందర్భంగా కొన్ని కామెడీ సీన్లు ఉంటాయని సమాచారం. కాశ్మీర్ నుండి ఆంధ్ర ట్రైన్ జర్నీ అంటే చాలా టైం పడుతుంది.

అందుకే సినిమా తొలిసగంలో ఈ ట్రైన్ ఎపిసోడ్ కాస్త లెంగ్తీగా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ లో మహేష్ తో పాటు హీరోయిన్ రష్మిక, బండ్ల గణేష్, రాజేంద్రప్రసాద్ అలానే మరికొంతమంది కమెడియన్లు కనిపిస్తారట. ఈ ట్రైన్ ఎపిసోడ్ కోసం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో ఏకంగా ఓ రైలు సెట్ ను వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎక్కువ రోజులు షూటింగ్ ఉంటుంది కాబట్టి సెట్ వేయాల్సి వస్తుందని చెబుతున్నారు. దీనికోసం భారీగా ఖర్చు చేస్తున్నారట. ఆగస్ట్ లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి వచ్చే  ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. 
 

click me!