గతంలోనే విడిపోయిన సౌందర్యకు విడాకులు మంజూరు చేసిన కోర్టు

Published : Jul 05, 2017, 05:01 PM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
గతంలోనే విడిపోయిన సౌందర్యకు విడాకులు మంజూరు చేసిన కోర్టు

సారాంశం

తమిళ సూపర్ స్టార్ రజినీ కూతురు సౌందర్య కు విడాకులు మంజూరు గత కొంత కాలంగా మనస్పర్థలతో భర్త అశ్విన్ కు దూరంగా వుంటున్న సౌందర్య తాజాగా సౌందర్య, అశ్విన్ దంపతులకు విడాకులు మంజూరు చేసిన కోర్టు

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య రజినీకాంత్ తన భర్త, చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అశ్విన్‌తో కొంతకాలంగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గతేడాది సెప్టెంబర్లోనే ఇద్దరూ విడిపోయినట్లు ప్రకటించారు. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టు నుండి వారికి మంగళవారం అఫీషియల్‌గా విడాకులు మంజూరయ్యాయి.

 

సౌందర్య-అశ్విన్ వివాహం 2010లో జరిగింది. దాదాపు ఐదేళ్ల పాటు అన్యోన్య దాంపత్యం సాగించారు. 2015లో వారికి ఒక బిడ్డ పుట్టాడు. కొడుకు తొలి పుట్టినరోజు సందర్భంగా ఏర్పడిన చిన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారి పెను దుమారానికి దారితీసింది. ఆ సందర్భంలో జరిగిన చిన్న ఘటన చివరకు పెద్ద గొడవకు దారి తీసి ఇద్దరూ విడిపోయే పరిస్థితులకు దారితీసింది. రజనీ కుటుంబ సభ్యులు ఇద్దరినీ కలిపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

 

కొంతకాలంగా పుట్టింట్లోనే ఉంటున్న సౌందర్య, ప్రస్తుతం సినిమానే తన కెరీర్ గా ఎంచుకుని ముందుకు సాగుతోంది. సౌందర్య రజినీకాంత్ 'కొచ్చాడియన్' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైంది. ప్రస్తుతం ధనుష్ హీరోగా వీఐపీ2 సినిమాకు సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కాజోల్ ముఖ్య పాత్రలో నటిస్తోంది. త్వరలో ఈచిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 విన్నర్‌లో మార్పు.. ఆడియెన్స్ ఓటింగ్‌తో పనిలేదా? అంతా వీళ్లదే నిర్ణయం
Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం