
సూపర్ స్టార్ రజినీకాంత్ రెండో కూతురు సౌందర్య రజినీకాంత్ తన భర్త అశ్విన్ తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు రావడంతో ఏడేళ్ల తమ వివాహ బంధానికి స్వస్తి చెప్పారు.
ఇప్పుడు సౌందర్య రెండో పెళ్లికి సిద్ధమైంది. ప్రముఖ వ్యాపారవేత్త విషాగన్ ని పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు దీనిపై సౌందర్య అధికార ప్రకటన చేసింది. మరో వారం రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
పెళ్లి గెటప్ లో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ తన కుమారుడు కాబోయే భర్త పేరుని జతచేసి క్యాప్షన్ గా పెట్టింది. రజినీకాంత్ ఇంట్లోనే ఈ వేడుకను నిర్వహించాలని భావిస్తున్నారు.అతి కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటి కాబోతుంది.
ఈ పెళ్లి వేడుకను వీలైంతసింపుల్ గా చేయాలనేది రజినీకాంత్ ఆలోచన. అందుకే కనీసం పెళ్లి శుభలేఖలను కూడా అచ్చు వేయించ లేదు. పెళ్లికి ఒకరోజు ముందు గెట్ టు గథెర్ ఏర్పాటు చేస్తున్నారు