BiggBoss7: పోలీసులకు చిక్కకుండా బాత్రూంలో దాక్కున్న శివాజీ.. ప్రియాంకతో కలసి సీక్రెట్ గా..

By Asianet NewsFirst Published Nov 23, 2023, 11:43 PM IST
Highlights

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 లో ప్రస్తుతం మర్డర్ ఇన్వెస్టిగేషన్ టాస్క్ జరుగుతోంది. ఈ టాస్క్ లో శివాజీ చాటుగా బిగ్ బాస్ తో మాట్లాడుతూ మర్డర్స్ చేస్తున్నారు. 

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 లో ప్రస్తుతం మర్డర్ ఇన్వెస్టిగేషన్ టాస్క్ జరుగుతోంది. ఈ టాస్క్ లో శివాజీ చాటుగా బిగ్ బాస్ తో మాట్లాడుతూ మర్డర్స్ చేస్తున్నారు. అమర్ దీప్, అర్జున్ పోలీసులుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అశ్విని, శోభా శెట్టి మీడియా ప్రతినిధులుగా నటిస్తున్నారు. 

శివాజీ మాత్రం చాలా సీక్రెట్ గా బిగ్ బాస్ ఇచ్చిన మర్డర్స్ ని పూర్తి చేస్తూ అనుమానం రాకుండా నటిస్తున్నాడు. ఈ రోజు కూడా శివాజీ రెండు మర్డర్స్ చేశారు. కానీ అర్జున్, అమర్ దీప్ పప్పులో కాలేసి రతికపై అనుమానం వ్యక్తం చేశారు. ఆమెని అరెస్ట్ చేశారు. 

Latest Videos

అశ్వినిని మర్డర్ చేసేందుకు శివాజీ అద్దంపై పేస్టు తో క్రై బేబీ అశ్విని గెట్ అవుట్ అని రాయాలి. ఆ పనిని శివాజీ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసి అశ్వినిని మర్డర్ అయ్యేలా చేశారు. ఇక బిగ్ బాస్ గౌతమ్ ని కూడా మర్డర్ చేయమని దానికోసం అతడికి స్టికర్ అంటించాలని కోరారు. కానీ ఇచ్చిన టైంలో శివాజీ ఆ పని పూర్తి చేయలేకపోయారు. 

దీనితో బిగ్ బాస్ శివాజీని తప్పుకొనమని.. ఆ పనిని ప్రియాంకకి ఎవరికీ అనుమానం రాకుండా అప్పగించాలని కోరారు. శివాజీ అలాగే చేశాడు. ప్రియాంక విజయవంతంగా మర్డర్ చేసింది. చివరికి అర్జున్, అమర్ లకు శివాజీపై అనుమానం వచ్చింది. దీనితో శివాజీ పారిపోయి బాత్రూమ్ లో దాక్కున్నారు. కానీ చివరకు శివాజీ పోలీసులకు లొంగిపోయారు. ఆ విధంగా నేటి ఎపిసోడ్ సరదాగా సాగింది. 

click me!