ఆ హీరోయిన్ ఇంట్లో అశ్లీల చిత్రాల షూటింగ్... మరో బాంబు పేల్చిన సింగర్ సుచిత్ర!

By Sambi ReddyFirst Published May 16, 2024, 5:09 PM IST
Highlights

సింగర్ సుచిత్ర కామెంట్స్ కోలీవుడ్ ప్రముఖులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. తాజాగా ఆమె ఫలానా హీరోయిన్ ఇంట్లో అశ్లీల చిత్రాల షూటింగ్ జరిగిందంటూ కీలక ఆరోపణలు చేసింది. 
 

2017లో సింగర్ సుచిత్ర కోలీవుడ్ ఉలిక్కి పడేలా చేసింది. హీరో రానా-త్రిష, ధనుష్ -త్రిష, అనిరుధ్ రవిచంద్రన్-ఆండ్రియా సన్నిహితంగా ఉన్న ఫోటోలు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. సుచి లీక్స్ పేరిట ప్రముఖుల ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం సంచలనమైంది. 

కొన్నాళ్ళు సద్దుమణిగిన సుచిత్ర మరలా సంచలన ఆరోపణలకు తెరలేపింది. ఇటీవల ఆమె ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్, కమల్ హాసన్ లను టార్గెట్ చేసింది. వారిపై అనుచిత కామెంట్స్ చేశారు. ధనుష్-ఐశ్వర్య తమ రిలేషన్ లో నిజాయితీగా లేరు. ఒకరినొకరు మోసం చేసుకున్నారని ఆమె అన్నారు. అలాగే కమల్ హాసన్ ని గే అన్నారు. కోలీవుడ్ లో డ్రగ్ కల్చర్ ఉంది. కమల్ హాసన్ బర్త్ డే పార్టీలో వెండి తాంబూలంలో కొకైన్ పెట్టి ఇచ్చారని అతిపెద్ద చర్చకు తెరలేపింది. 

Latest Videos

వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న సుచిత్ర మరో నటిపై కీలక ఆరోపణలు చేసింది. ఈసారి ఆమె నటి వనిత విజయ్ కుమార్ ని టార్గెట్ చేశారు. ఆమె ఇంట్లో అశ్లీల చిత్రాల షూటింగ్ జరిగిందని బాంబు పేల్చింది. సన్నిహితులు వనిత విజయ్ కుమార్ కి ఓ బంగ్లా ఇచ్చారు. ఆ బంగ్లాను వనిత విజయ్ కుమార్ తమిళ నటుడు బయిల్వాన్ రంగనాథ్ కి ఇచ్చింది. ఆ బంగ్లాలో బయిల్వాన్ అశ్లీల చిత్రాల షూటింగ్ చేశాడని సుచిత్ర అన్నారు. 

బయిల్వాన్ ఇతర నటుల మీద ఆరోపణలు చేస్తాడు కానీ వనిత విజయ్ కుమార్ పై చేయడు. దానికి కారణం ఇదే అని సుచిత్ర అన్నారు. వనిత విజయ్ కుమార్ ఇంట్లో అశ్లీల చిత్రాల షూటింగ్ జరిగిన కారణంగానే ఆ హౌస్ ని అధికారులు సీజ్ చేశారని కీలక ఆరోపణలు చేసింది. బయిల్వాన్ రంగనాథన్ అశ్లీల చిత్రాలకు ఏజెంట్ గా పని చేశాడు. శరత్ కుమార్, రాధా రవి వంటి నటులు ఈ అశ్లీల చిత్రాల షూటింగ్ ని అడ్డుకున్నారని సుచిత్ర చెప్పుకొచ్చింది. కాగా రోజుకొకరిని టార్గెట్ చేస్తున్న సుచిత్ర నెక్స్ట్ టార్గెట్ ఎవరనే ఆందోళనలు మొదలయ్యాయి.. 
 

click me!