తెలుగులో మరో పాట పాడనున్న స్టార్ హీరో శింబు.. ఎవరి కోసమో తెలుసా..

By team teluguFirst Published Nov 26, 2022, 4:17 PM IST
Highlights

తమిళ క్రేజీ హీరో శింబు యువతలో ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్ ఆరంభంలో శింబు వల్లభ, మన్మధ లాంటి యూత్ ఫుల్ చిత్రాలతో అలరించాడు.

తమిళ క్రేజీ హీరో శింబు యువతలో ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్ ఆరంభంలో శింబు వల్లభ, మన్మధ లాంటి యూత్ ఫుల్ చిత్రాలతో అలరించాడు. ఇప్పుడు విభిన్నమైన చిత్రాలు చేస్తున్నాడు. శింబు చివరగా మానాడు చిత్రంతో హిట్ కొట్టాడు. 

శింబుకి తెలుగు హీరోలతో మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. జూ.ఎన్టీఆర్, మంచు మనోజ్, రామ్ పోతినేని ల చిత్రాలకు శింబు ఇదివరకే పాటలు పాడారు. బాద్షా చిత్రంలో డైమండ్ గర్ల్, పోటుగాడు చిత్రంలో బుజ్జిపిల్ల, ది వారియర్ మూవీలో 'బుల్లెట్' పాటలు పాడి శింబు అలరించాడు. 

ఇప్పుడు మరోసారి తెలుగులో పాట పాడేందుకు శింబు రెడీ అవుతున్నాడు. ఈసారి శింబు యంగ్ హీరో నిఖిల్ కోసం తన గాత్రం అందించబోతున్నాడు. యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ 2 చిత్రం పాన్ ఇండియా హిట్ కావడంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా 18 పేజెస్ అనే చిత్రంలో నటిస్తున్నారు. 

కుమారి 21 ఎఫ్ ఫేమ్ సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకుడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మరింత బజ్ పెంచేందుకు శింబుతో ఒక పాట పాడించనున్నారట. త్వరలో శింబు నిఖిల్ కోసం సాంగ్ పాడనున్నట్లు తెలుస్తోంది. టైం ఇవ్వు పిల్ల అనే పాటని శింబు పాడబోతున్నట్లు తెలుస్తోంది. 

కార్తికేయ 2 చిత్రం పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కావడంతో 18 పేజెస్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 23న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది. 

 

click me!