మ్యూజిక్ డైరెక్టర్ గా మారనున్న స్టార్ సింగర్

By Prashanth MFirst Published Jul 10, 2019, 9:50 AM IST
Highlights

సౌత్ లో ఇటీవల బాగా పాపులర్ అయిన సింగర్ సిద్ శ్రీరామ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారనున్నాడు. ఏఆర్. రెహమాన్ సాంగ్స్ తో ఎక్కువగా పాపులర్ అయిన సిద్  గీతగోవిందం సాంగ్స్ తో టాలీవుడ్ మరింతగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

సౌత్ లో ఇటీవల బాగా పాపులర్ అయిన సింగర్ సిద్ శ్రీరామ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారనున్నాడు. ఏఆర్. రెహమాన్ సాంగ్స్ తో ఎక్కువగా పాపులర్ అయిన సిద్ గీతగోవిందం సాంగ్స్ తో టాలీవుడ్ మరింతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ సింగర్ గత కొన్నేళ్లుగా సంగీత దర్శకుడవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. 

ఫైనల్ గా మణిరత్నం నిర్మించనున్న మల్టీస్టారర్ ద్వారా ఈ కుర్ర సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారబోతున్నాడు. జివి.ప్రకాష్ కుమార్ - విక్రమ్ ప్రభు - మడోన్నా సెబాస్టియన్ వంటి స్టార్స్ కలిసి నటిస్తున్న 'వానం కొట్టాటూమ్' అనే తమిళ్ సినిమాకు ధనా శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. 

మణిరత్నం దగ్గర పలు సినిమాలకు సహాయ దర్శకుడిగా వర్క్ చేసిన శేఖర్ ఈ సినిమాను రియలిస్టిక్ గా తెరకెక్కిస్తున్నాడట. మొదట ఈ సినిమాకు 96 ఫెమ్ గోవింద్ వసంతని సంగీత దర్శకుడిగా అనుకోగా అనంతరం సిద్ శ్రీరామ్ కి అవకాశం ఇచ్చారు.      

click me!