`గేమ్‌ ఛేంజర్‌` ఒక్క పాట సెట్‌ కోసం అన్ని కోట్లా?.. ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔటే?

`గేమ్‌ ఛేంజర్‌` నుంచి తొలి పాట రాబోతుంది. `జరగండి జరగండి` అంటూ ఈ పాట సాగుతుందట. ఈ పాటని దీపావళికి విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ని పంచుకున్నారు. 

Google News Follow Us

దర్శకుడు శంకర్‌ గ్రాండియర్‌కి కేరాఫ్‌. ఆయన రూపొందించే ఈ సినిమా అయినా చాలా లావిష్‌గా ఉండాలనుకుంటారు. అలానే తీస్తారు. అందుకే ఆయన సినిమాలకు వందల కోట్లు బడ్జెట్‌ అవుతుంటుంది. ఇప్పుడు రామ్‌చరణ్‌ తో `గేమ్‌ ఛేంజర్‌`ని రూపొందిస్తున్నారు దర్శకుడు శంకర్‌. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

దిల్‌రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సుమారు మూడు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. మొదట రెండు వందల కోట్ల బడ్జెట్‌ అనుకున్నారు. కానీ ఇప్పుడు మూడు వందల కోట్లు దాటుతుందని సమాచారం. అయితే తాజాగా ఓ క్రేజీ వార్త సోషల్‌ మీడియాలో వినిపిస్తుంది. ఒక్క పాట కోసం శంకర్‌ పెట్టిన ఖర్చు షాకిస్తుంది. ఫ్యూజుల్‌ ఔట్‌ అయ్యేలా చేస్తుంది. 

`గేమ్‌ ఛేంజర్‌` నుంచి తొలి పాట రాబోతుంది. `జరగండి జరగండి` అంటూ ఈ పాట సాగుతుందట. ఈ పాటని దీపావళికి విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ని పంచుకున్నారు. కలర్‌ ఫుల్‌గా ఈ పోస్టర్‌ ఉంది. ఇందులో రామచరణ్‌ బ్లూ కలర్‌ డ్రెస్‌లో కనిపిస్తున్నారు. పేక మేడలను తలపించేలా ఇళ్లున్నాయి. ఆ ఇంటి వద్ద గిరిజన మహిళలున్నారు. చూడ్డానికి ఫుల్‌ కలర్‌ ఫుల్‌గా ఉంది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 

చూడ్డానికి ఎక్కడో రియల్‌ లొకేషన్ల లా ఉంది. కానీ ఇదంతా ఓ సెట్‌ అని సమాచారం. దీనికోసం భారీగానే ఖర్చు చేశారట. ఏకంగా 16కోట్లు ఈ సాంగ్‌ సెట్‌ కోసమే ఖర్చయ్యిందని సమాచారం. ఇది సెట్‌లా కాకుండా ఒరిజినల్‌ లొకేషన్ ని తలపించేలా కనిపిస్తుందని సమాచారం. సినిమాలో చూసినప్పుడు అదొక వండర్‌లా ఉంటుందని తెలుస్తుంది. మరి ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. 

ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. రామ్‌చరణ్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారట. ఇక ఇందులో చరణ్‌కి జోడీగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీకాంత్‌, అంజలి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్‌లోగానీ, ద్వితీయార్థంలోగానీ రిలీజ్‌ చేసే అవకాశం ఉంది.   
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!