దృశ్యం 2 డైరెక్టర్ తో త్వరలో యంగ్ హీరోయిన్ వివాహం.. కంఫర్మ్ చేసిన నటి..

By Asianet NewsFirst Published Feb 2, 2023, 5:52 PM IST
Highlights

ఫిబ్రవరి నెల బాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ గా మారిపోతోంది. ఇటీవల అతియా శెట్టి, కేఎల్ రాహుల్ వివాహం జరిగింది. త్వరలో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు.

ఫిబ్రవరి నెల బాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ గా మారిపోతోంది. ఇటీవల అతియా శెట్టి, కేఎల్ రాహుల్ వివాహం జరిగింది. త్వరలో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. మరో జంటగా కూడా ఫిబ్రవరిలో పెళ్లి బాజా మోగించడం ఖాయంగా మారింది. 

హిందీలో దృశ్యం 2 చిత్రంతో యువ దర్శకుడు అభిషేక్ పాఠక్ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. రీమేక్ చిత్రమే అయినప్పటికీ దృశ్యం 2 హిందీలో ఘనవిజయం సాధించింది. ఈ యువ దర్శకుడుతో యంగ్ హీరోయిన్ శివలేఖ ఒబెరాయ్ ప్రేమలో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజమయ్యాయి. 

అభిషేక్ తో తన పెళ్లిని కంఫర్మ్ చేస్తూ శివలేఖ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 'ఆకాశంలో అన్ని నక్షత్రాలు ఉన్నాయి.. సముద్రపు ఒడ్డున నక్షత్ర చేపలు ఉన్నాయి. కానీ వాటన్నింటిని పట్టించుకోకుండా అతడు నా వైపే చూస్తున్నాడు.. హలో ఫిబ్రవరి' అంటూ శివలేఖ పోస్ట్ చేసింది. 

ఈ పోస్ట్ లో తన ముఖం కనిపించేలా.. అభిషేక్ ముఖం బ్లర్ అయ్యేలా శివలేఖ పోస్ట్ చేసింది. గోవాలో వీరిద్దరి వివాహం కొద్దిమంది కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జరగనున్నట్లు బిటౌన్ వర్గాలు చెబుతున్నాయి. 

శివలేఖ 'యేసాలి ఆషీకీ' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అభిషేక్ నిర్మించిన ఖుదా హఫీజ్ సిరీస్ లో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంతోనే అభిషేక్, శివలేఖ మధ్య పరిచయం ప్రేమగా మారింది.  

 

click me!