తన ఇంట్లో దొంగలు.. చూసి షాకైన షారూఖ్‌.. విచారణలో ఆసక్తికర విషయాలు వెల్లడి!

Published : Mar 08, 2023, 07:25 PM ISTUpdated : Mar 08, 2023, 07:27 PM IST
తన ఇంట్లో దొంగలు.. చూసి షాకైన షారూఖ్‌.. విచారణలో ఆసక్తికర విషయాలు వెల్లడి!

సారాంశం

షారూఖ్‌ ఖాన్‌ ఇంట్లో ఇటీవల ఇద్దరు దొంగలు పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వాళ్లిద్దరు పోలీస్‌ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే ఈ విచారణలో పలు ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి.

`పఠాన్‌`తో చాలా రోజుల తర్వాత హిట్‌ని అందుకున్నారు షారూఖ్‌ ఖాన్‌. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతోపాటు అనేక రికార్డులను క్రియేట్‌ చేసింది. హిందీ వెర్షన్‌లో `బాహుబలి 2` రికార్డులు బ్రేక్‌ చేసింది. ఈ సక్సెస్‌ ఆనందంలో ఉన్న షారూఖ్‌కి ఇంట్లో పెద్ద షాక్‌ ఎదురైంది. ఇద్దరు దొంగలు పడటం ఆయన్ని ఆశ్యర్యానికి గురి చేసింది. అంతేకాదు పోలీస్‌ విచారణలో పలు షాకింగ్‌ విషయాలు బయటకొచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఇటీవల షారూఖ్‌ ఇంట్లో దొంగలు పడ్డారు. ముంబయిలోని మన్నత్‌ ఇంట్లో ఇద్దరు దొంగలను సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. వారిని పోలీసులకు అప్పగించారు. అయితే వారు గుజరాత్‌కి చెందిన పఠాన్‌ సాహిల్‌ సలీ ఖాన్‌, రామ్‌ సరాఫ్‌ కుస్వాహాగా పోలీసుల విచారణలో తేలింది. మన్నత్‌ ఇంటి సెక్యూరిటీ సిబ్బంది వారిని గుర్తించడానికి ముందు దాదాపు ఎనిమిదిగంటలపాటు వాళ్లు షారూఖ్‌ పర్సనల్‌ మేకప్‌ రూమ్‌లో ఉన్నారట. మూడో అంతస్థులో ఉన్న మేకప్‌ రూమ్‌లోకి వారు దూరడం గమనార్హం. ఫిబ్రవరి 2న ఉదయం 3 గంటలకు వాళ్లు ఇంట్లోకి చొరబడ్డారట. 

 ఉదయం పదిన్నర గంటలకు సెక్యూరిటీ పట్టుకున్నారు. 11 గంటలకు వాళ్లు మన్నత్‌ సెక్యూరి మేనేజర్ కొలీన్‌ డిసౌజాలకు సమాచారం అందించారు. కీపింగ్‌ సెక్యూరిటీ సతీష్‌ వారిని గుర్తించారని పోలీసులు తమ విచారణలో వెల్లడించారు. ఆ తర్వాత వారిని లాబీలోకి తీసుకెళ్లగా, అక్కడ వారిని షారూఖ్‌ ఖాన్‌ చూశారు. ఆ సమయంలో ఆయన పెద్ద షాక్‌కి గురయినట్టు తెలిపారు. దొంగలపై పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అయితే తమ విచారణలో వాళ్లు షారూఖ్‌కి అభిమానులమని, ఆయన్ని కలవడానికి వచ్చామని చెప్పడం గమనార్హం. మరి ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి. 

ఇక ఇటీవల `పఠాన్‌`తో కెరీర్‌ బెస్ట్ హిట్‌ ని అందుకున్నారు షారూఖ్ ఖాన్‌. ఇందులో దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటించగా, సల్మాన్‌ ఖాన్‌ గెస్ట్ రోల్‌ చేశారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించారు. ఇక ప్రస్తుతం ఆయన `జవాన్‌` చిత్రంలో నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. నయనతార కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

OTT Movies: ఓటీటీలో దుమ్ములేపుతున్న తెలుగు థ్రిల్లర్‌ ఇదే.. లిస్ట్‌
స్టార్ హీరో డెబ్యూ టైంకి ఇంకా పుట్టని హీరోయిన్లు..ఇప్పుడు వాళ్ళతోనే రొమాన్స్, ఏజ్ గ్యాప్ తెలిస్తే షాకే!