
ఆసారి సాలిడ్ హిట్ కోసం డబుల్ ఇస్మార్ట్ ను స్టార్ట్ చేశాడు పూరీ జగన్నాథ్. రామ్ పోతినేని కోసం.. డబుల్ పవర్ ఉన్న సంజయ్ దత్ ను విలన్ గా తీసుకున్నాడు. ఇకఈసినిమా కోసం ఆయన తసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
మాస్ ఇమేజ్ కోసం పాకులాడుతున్నాడు రామ్ పోతినేని. ఆయనకు ఇస్మార్ట్ శంకర్ సినిమతో ఆఇమేజ్ వచ్చింది. అయితే ఆతరువాత చేసిన సినిమాల ఫెయిల్యర్ బాగాకుంగసిందింది.ఆసారి ఊరమాస్ అనిపించుకోవడం కోసం..అటు బోయపాటితో స్కంధ మూవీ చేస్తూ.. ఇటు పూరీ జన్నాథ్ తో డబుల్ ఇస్మార్ట్ స్టార్ట్ చేశాడు రామ్. ఇక ఈమూవీలో విలన్ గా బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో.. కెజియఫ్ 2 స్టార్ సంజయ్ దత్ నుతీసుకున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా
ఆయన ఫస్ట్ లుక్ ను కూడా చిత్ర టీమ్ బయటకు వదిలింది. అయితే ఈ సినిమాకు సంజయ్ దత్ పుచ్చుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కథ నచ్చడంతో పూరీ జగన్నాథ్ సంప్రదించిన వెంటనే సంజయ్ దత్ ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట . అంతే కాదు ఈ 60 రోజులు డేట్స్ ఇచ్చాడట. అయితే ఆ అరవై రోజుల కోసం సంజయ్ దత్ ఏకంగా రూ. 15 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నాడని ఇన్సైడ్ జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే టాలీవుడ్ లో మాత్రం చాలా మంది స్టార్లకు ఈ స్థాయిలో పారితోషికం తీసుకోవడంలేదు. అటువంటిది..విలన్ పాత్రకోసం సంజయ్ దత్ ను తీసుకోవడం ఒక ఎత్తు అయితే ఆయన తీసుకునే రెమ్యూరేశన్ మరో ఎత్తు అయ్యింది. ఈసినిమాలో విలన్ గా చేస్తున్న సంజయ్ దత్ 15 కోట్లు తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. విలన్ కే అంత ఇస్తున్నారంటే.. హీరో రామ్ రెమ్యునరేషన్ ఎంత ఉంటుందో అని నెటిజన్లు చర్చలు షురూ చేశారు.