`పుష్ప` సినిమాలో సమంత నర్తించిన ఐటెమ్ సాంగ్ని శుక్రవారం సాయంత్రం రిలీజ్ చేసింది యూనిట్. ఆద్యంతం కలర్ఫుల్గా, సమంత విశ్వరూపంతో సాగే ఈ పాట తెగ ఆట్టుకుంటుంది.
సమంతSamantha) ఫస్ట్ టైమ్ చేసిన ఐటెమ్సాంగ్ ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. `ఊ అంటావా.. ఉఉ అంటావా`(OO Antava) అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియో ఏకంగా వంద మిలియన్స్ కిపైగా వ్యూస్ని సాధించింది. తాజాగా ఈ పాట పూర్తి వీడియోని విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం ఈ ఐటెమ్ సాంగ్ పూర్తి వీడియోని రిలీజ్ చేసింది యూనిట్. ఆద్యంతం కలర్ఫుల్గా, సమంత విశ్వరూపంతో సాగే ఈ పాట తెగ ఆట్టుకుంటుంది. యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది. విడుదల చేసిన కాసేపట్లతోనే ఇది రెండు మిలియన్స్ కి పైగా వ్యూస్ని దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం నెట్టింట్ హల్చల్ చేస్తుంది.
ఇందులో Samantha వేసిన మాస్ స్టెప్పులు కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. ఆమె హవాభావాలు, హాట్ పోజులు పిచ్చెక్కించేలా ఉన్నాయి. పాట అభిమానులకు మైండ్ బ్లాంక్ చేస్తుంది. ఈ శుక్రవారం(జనవరి 7)న అమెజాన్ ప్రైమ్లో `పుష్ప`(Pushpa) చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. సాయంత్రం ఎనిమిది గంటల నుంచి Pushpa సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో సమంత ఐటెమ్ సాంగ్ని విడుదల చేయడంతో యూట్యూబ్లో ఇది దుమ్ములేపుతుందని చెప్పొచ్చు. శ్రోతలని ఉర్రూతలూగిస్తుంది.
ఇక అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన `పుష్ప` చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకుపోతుంది. రికార్డ్ కలెక్షన్లని రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటి వరకు మూడు వందల కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కేవలం ఒక్క హిందీలోనే ఇది 75కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. బాలీవుడ్ మేకర్స్ కే షాక్ ఇచ్చింది. హిందీలో వస్తోన్న కలెక్షన్లకి చిత్ర యూనిట్ సైతం ఆశ్చర్యపోవడం విశేషం. ఇందులో సమంత నటించిన ఐటెమ్ సాంగ్ హైలైట్గా నిలిచిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
సినిమా థియేటర్లో రన్నింగ్లో ఉండగానే ఓటీటీలో విడుదల చేయడం విశేషం. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఏక్షణమైన థియేటర్లు క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉందని భావించిన యూనిట్ సినిమాని వెంటనే ఓటీటీలో రిలీజ్ చేయాలని భావించారు. థియేటర్ ఫ్లోటింగ్ ఓటీటీ వైపు మళ్లే ఛాన్స్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక `ఊ అంటావా ` పాటకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, ఇంద్రావతి చౌహాన్ ఈ పాటని ఆలపించగా, చంద్రబోస్ రాశారు.