సమంత చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ గా మారింది. అప్పుడప్పుడూ సామ్ తాను నటించిన చిత్రాల గురించి కూడా ప్రస్తావిస్తూ ఉంటుంది.
సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న స్టార్ బ్యూటీ సమంత సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. ప్రస్తుతం సమంత తన హెల్త్ ని మెరుగుపరుచుకుంటూ యోగ వర్కౌట్స్ చేస్తోంది. సమంత తదుపరి చిత్రం ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు. చివరగా సామ్ ఖుషి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.
తాజాగా సమంత చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ గా మారింది. అప్పుడప్పుడూ సామ్ తాను నటించిన చిత్రాల గురించి కూడా ప్రస్తావిస్తూ ఉంటుంది. తాజాగా సమంత మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన లేటెస్ట్ మూవీ కాతల్ ది కోర్ చిత్రాన్ని వీక్షించింది. ఈ మూవీలో మమ్ముట్టి, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించారు.
జియో బేబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటోంది. సమంత ఈ మూవీ చూసిన అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఈ ఏడాదిలోనే బెస్ట్ మూవీ.. ఈ బ్యూటిఫుల్ అండ్ పవర్ ఫుల్ మూవీ చూస్తే మీకు మీరే మంచి చేసుకున్నవాళ్లవుతారు. మమ్ముట్టి సర్.. మీరే నా హీరో.
చాలా రోజుల పాటు మీ నటన గుర్తుండిపోతుంది. దీని నుంచి నేను బయటకి రాలేకున్నా. లవ్యూ జ్యోతిక .. దర్శకుడు జియో బేబీ మీరు లెజెండ్ అంటూ సమంత ప్రశంసల వర్షం కురిపించింది.