బడ్జెట్ ఎక్కువ అవ్వడంచేత మైత్రీమూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించలేమని ఆపేసారని అంటున్నారు. అయితే ఈ స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తి కావొచ్చింది.
రవితేజ, మలినేని గోపీచంద్ల సినిమా ఆగిపోయిందంటూ ఓ వార్త మీడియాలో గత కొద్ది రోజులుగా హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. బ్లాక్బాస్టర్ ‘క్రాక్’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుంది అనుకున్న సమయంలో ఇలాంటి వార్త రావటం అభిమానులకు షాక్ ఇచ్చింది. బడ్జెట్ ఎక్కువ అవ్వడంచేత మైత్రీమూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించలేమని ఆపేసారని అంటున్నారు. అయితే ఈ స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ సినిమాకు సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. అయితే రవితేజతో వద్దనుకుంటున్నారు కానీ ప్రాజెక్టు ఆపేయలేదట. రవితేజ రెమ్యునరేషన్ విషయంలో నెగోషియేషన్స్ జరుగుతున్నాయట. ఆయన తన రెమ్యునరేషన్ తగ్గించుకుని సహకరిస్తే ...కొంత వెసులుబాటుతో చేద్దామని ఆలోచనట. అయితే అదే సమయంలో నిర్మాతల దగ్గర ప్లాన్ బి కూడా ఉందిట.
ఈ సినిమా కోసం మైత్రీ మూవీస్ వారు హిందీ నుంచి ,తమిళ నుంచి సీనియర్ హీరోలను వెతుకుతున్నట్లు సమాచారం. మైత్రీ వారికి సల్మాన్ ఖాన్ చేయాల్సిఉంది. అక్కడ అడ్వాన్స్ ఉందని, దాంతో సల్మాన్ కు ఈ కథ వినిపించాలనే ఆలోచనలో కూడా ఉన్నారట. గతంలో రవితేజ చేసిన రీమేక్ లు సల్మాన్ చేసి ఉన్నారు. దాంతో రవితేజ బాడీ లాంగ్వేజ్ కు మ్యాచ్ అవుతుందని భావిస్తున్నారట. అయితే సల్మాన్ కోసం అని బడ్జెట్ అయితే పెంచమని, ఇక్కడ తెలుగుకు అనుకున్న బడ్జెట్ తోనే సల్మాన్ తోనే చేయగలిగితే ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నారట. సల్మాన్ మార్కెట్ మొన్న టైగర్ 3 యావరేజ్ టాక్ బాగా వెనకబడింది. తెలుగు కు ఎంత అయితే పెడదామనకున్నరో అంత పెట్టి హిందీలో చేస్తే సేఫ్ అని నిర్మాతలు అనుకుంటున్నారు. అది సాధ్యం కాకపోతే తమిళ హీరోని సీన్ లోకి తెచ్చి ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కిస్తారట.
అయితే ఇవన్నీ అఫీషియల్ వార్తలు అయితే కాదు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్నవి మాత్రమే. ప్రస్తుతానిక ఈ కథకు సంబంధించి స్క్రిప్ట్వర్క్లో మలినేని గోపీచంద్, సాయిమాధవ్బుర్రా బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్కి వెళ్లనుంది. ఇందులో రవితేజ పాత్ర ‘క్రాక్’ని మించే అత్యంత శక్తిమంతంగా ఉంటుందని చెప్తున్నారు.