సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా NTR31పై సాలిడ్ కామెంట్స్ చేశారు. స్టోరీ ఏ రేంజ్ లో ఉండబోతోందో చెప్పుకొచ్చారు. మూవీ పట్టాలెక్కముందే హైప్ పెంచేస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) అప్ కమింగ్ ఫిల్మ్ NTR31పై అభిమానుల్లో తారాస్థాయిలో అంచనాలున్నాయి. ఇప్పటి వరకు తారక్ చేసిన సినిమాలన్నీ ఒకెత్తు.. ఎన్టీఆర్31 ఒకెత్తు అనేలా కనిపిస్తోంది. ఎందుకంటే ఆ చిత్రాన్ని ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కించడమే విశేషం. ఇప్పటికే ఈ సినిమాను అనౌన్స్ చేసి స్పెషల్ పోస్టర్లను కూడా విడుదల చేశారు.
నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ షూటింగ్ పై ఇప్పటికే అఫీషియల్ అప్డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 2024లో ప్రారంభమవుతుందని అధికారికంగా ప్రకటించిన విషయం తెలసిందే. ఈ ప్రతిష్టాత్మకమైన హై-ఆక్టేన్ మూవీ భారతీయ సినిమాల్లో కొత్త బెంచ్మార్క్ను సృష్టిస్తుందంటూ మేకర్స్ కూడా సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇక తాజాగా ప్రశాంత్ నీల్ ‘ఎన్టీఆర్31’ స్టోరీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ 31 చిత్రం డిఫరెంట్ ఫిల్మ్ అని, డిఫరెంట్ ఎమోషన్స్ ను కలిగి ఉంటుందన్నారు. దీన్ని ప్రస్తుత జానర్లతో పోల్చడం సరిపోదన్నారు. ఆడియెన్స్ దీన్ని యాక్షన్ ఫిల్మ్ గా ఊహించుకుంటున్నారు. కానీ దీని లెక్క వేరేలా ఉంటుందని చెప్పారు. ఆడియెన్స్ కు నేను చెప్పబోయే కొత్త కథ ఇది... ఇందులో ఉండే ఎమోషన్స్ చాలా ప్రత్యేకంగా నిలుస్తాయని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ Salaar Cease Fire మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ట్రైలర్ విడుదలైంది. ప్రభాస్ అభిమానుల కోసం మరో ట్రైలర్ ను రెడీ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాలశివ దర్శకత్వంలో Devaraలో నటిస్తున్నారు. ఈ చిత్రంపైనా భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం రిలీజ్ తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ మూవీలో నటించనున్నారు.