మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్న 'రిపబ్లిక్' ట్రైలర్.. తేజు Vs రమ్యకృష్ణ, నెక్స్ట్ లెవల్ పెర్ఫామెన్స్

By telugu teamFirst Published Sep 22, 2021, 11:36 AM IST
Highlights

బైక్ నుంచి పడి ప్రమాదానికి గురైన సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) ప్రస్తుతం కోలుకుంటున్నాడు. సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ 'రిపబ్లిక్'(Republic). 

బైక్ నుంచి పడి ప్రమాదానికి గురైన సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) ప్రస్తుతం కోలుకుంటున్నాడు. సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ 'రిపబ్లిక్'(Republic). సందేశాత్మక అంశాలతో సోషల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ప్రస్థానం' లాంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం తెరకెక్కించిన దేవకట్టా ఈ చిత్రానికి దర్శకుడు. 

రిలీజ్ టైం దగ్గరపడుతుండటంతో.. తేజు చికిత్స పొందుతున్నప్పటికీ రిపబ్లిక్ ట్రైలర్ విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా కొద్దిసేపటి క్రితమే ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ అయింది. 

'సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1 వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష' అంటూ చిరంజీవి సోషల్ మీడియాలో రిపబ్లిక్ ట్రైలర్ లాంచ్ చేశారు. 

ట్రైలర్ విషయానికి వస్తే.. దేవకట్టా ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తేజు ఈ మూవీలో ఇంటెన్స్ పెర్ఫామెన్స్ తో మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాడు. రాజకీయ నాయకుల చేతిలో ప్రస్తుతం రాజ్యాంగ వ్యవస్థ ఎలా నిర్వీర్యం అవుతోందో ఈ చిత్రంలో చూపించినట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది. 

'సమాజంలో తిరిగే అర్హతే లేని గుండాలు పట్టపగలే బాహాటంగా అమాయకుల ప్రాణాలు తీస్తుంటే కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థలు వాళ్ళకి కొమ్ము కాస్తున్నాయి' అంటూ తేజు చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. 

ఈ చిత్రంలో రాజకీయ నాయకురాలిగా నెగిటివ్ షేడ్స్ లో రమ్యకృష్ణ నటిస్తున్నారు. సాయిధరమ్ తేజ్, రమ్యకృష్ణ మధ్య సన్నివేశాలు ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయి. 'అజ్ఞానం గూడు కట్టిన చోటే మోసం గుడ్లు పెడుతుంది కలెక్టర్' అంటూ రమ్యకృష్ణ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఆమెని నిలువరించేందుకు తన శక్తియుక్తులా పోరాడుతున్న కలెక్టర్ గా తేజు కనిపిస్తున్నాడు. 

మణిశర్మ అందించిన బీజియం ప్రతి సన్నివేశాన్ని హైలైట్ చేస్తోంది. దేవాకట్టా ఎంతో ఇష్టపడి తెరకెక్కించిన ఈ చిత్రం స్టైకింగ్ గా ఉండబోతోందని ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది. ఇక ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. తేజు తన ఇంటెన్స్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్న రిపబ్లిక్ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి. 

 

click me!