విరూపాక్ష సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా అభిమానులతో ట్విట్టర్ వేదికగా జరిపిన చిట్ చాట్ లో భాగంగా ఒక అభిమాని మాస్ సినిమా చేయొచ్చుగా అని అడిగాడు.
మెగా క్యాంప్ లోకి ఓ సారి అడుగు పెడితే చాలు ఇంక హీరోలకు వెతుక్కోనక్కర్లేదు అని ఇండస్ట్రీలో చెప్తూంటారు. అది నిజమే అని చాలా సార్లు చాలా మంది డైరక్టర్స్ ప్రూవ్ చేసారు. చేస్తూనే ఉన్నారు. ఆ క్రమంలో ఇప్పుడు మరో డైరక్టర్ ఆ క్యాంప్ లో నుంచి వచ్చిన సంపత్ నందికి మరోసారి అదే క్యాంప్ నుంచి సినిమా దొరికింది. రామ్ చరణ్ తో గతంలో రచ్చ వంటి సూపర్ హిట్ చిత్రం ఇచ్చి ఉన్నారు సంపత్ నంది. ఆ తర్వాత వేర్వేరు హీరోలతో సినిమా చేసిన సంపత్ నంది..గత కొంతకాలంగా సాయి ధరమ్ తేజ తో సినిమా కోసం ట్రై చేస్తున్నారు. ఓకే అయ్యిన ప్రాజెక్టు ఇన్నాళ్లకు పట్టాలు ఎక్కబోతోంది. ఆ విషయం అఫీషియల్ గా సోషల్ మీడియా వేదికదా దర్శకుడు, హీరో తెలియచేసారు. వివరాల్లోకి వెళితే..
యాక్సిడెంట్ తర్వాత విరూపాక్ష రూపంలో బలమైన కంబ్యాక్ అనుకున్న సాయి ధరమ్ తేజ్ మంచి ఉషారుగా ఉన్నారు బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కడాన్ని యూనిట్ ఎంజాయ్ చేస్తోంది. దానికి తోడు మే 5న హిందీ వెర్షన్ ని విడుదల చేయబోతున్నారు. దాంతో ప్రమోషన్లను ప్యాన్ ఇండియా లెవెల్ లో చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే సంపత్ నందితో సాయిధరమ్ తేజ్ ప్రాజెక్టు లాక్ అయ్యింది. విరూపాక్ష సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా అభిమానులతో ట్విట్టర్ వేదికగా జరిపిన చిట్ చాట్ లో భాగంగా ఒక అభిమాని మాస్ సినిమా చేయొచ్చుగా అని అడిగాడు.
దానికి తేజు సమాధానమిస్తూ ఏంటి సంపత్ నంది సిద్ధమేనా అంటూ ట్యాగ్ చేయడం అతనూ వెంటనే లైన్ లోకి వచ్చి ఔనన్నట్టు సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. అఫీషియల్ గా ఇంకా ప్రకటించనప్పటికీ మొత్తానికి ఇద్దరూ ఓకే అనుకున్న మాట నిజమే అని తేలిపోయింది.
ఇక సంపత్ నంది చాలా ఏళ్లుగా ఫామ్ లో లేదన్న సంగతి తెలిసిందే. రచ్చ సక్సెస్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి సక్సెస్ రాలేదు. బెంగాల్ టైగర్, గౌతమ్ నందా, సీటిమార్ ఏవీ పెద్ద హిట్స్ కాలేదు. మధ్యలో కథకుడిగా నిర్మాతగా పలు సినిమాలు చేశాడు కానీ డైరెక్టర్ గా మాత్రం పెద్ద సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే సాయి ధరమ్ తేజ్ తో పక్కా మాస్ మసాలా కథ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. విరూపాక్ష తర్వాత తేజు నుంచి వచ్చే చిత్రం కావటంతో ఎక్సపెక్టేషన్స్ మాత్రం హై గా ఉంటాయి.