వార్త నిజమైతే... సాయి ధరమ్ తేజకు డేంజర్ బెల్ మోగినట్లే

By Prashanth MFirst Published Feb 7, 2019, 6:17 PM IST
Highlights

హిట్ లో ఉన్న హీరో మీద ఎంత ఖర్చైనా పెట్టడానికి నిర్మాతలు వెనకాడరు. ఎందుకంటే ఆ స్దాయి బిజినెస్ జరుగుతుంది కాబట్టి ఉత్సాహపడతారు. కానీ వరస ఫ్లాఫ్ లు తో సినిమాలు చేసే హీరో కు ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా భయపడతారు. బడ్జెట్ లు కోత పెట్టడం మొదలెడతారు. అయితే ఆ విషయం గమనించి హీరో మేల్కొనకపోతే డేంజర్ లో పడిపోయినట్లే. ఇప్పుడు సాయి ధరమ్ తేజ పరిస్దితి అదే.

హిట్ లో ఉన్న హీరో మీద ఎంత ఖర్చైనా పెట్టడానికి నిర్మాతలు వెనకాడరు. ఎందుకంటే ఆ స్దాయి బిజినెస్ జరుగుతుంది కాబట్టి ఉత్సాహపడతారు. కానీ వరస ఫ్లాఫ్ లు తో సినిమాలు చేసే హీరో కు ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా భయపడతారు. బడ్జెట్ లు కోత పెట్టడం మొదలెడతారు. అయితే ఆ విషయం గమనించి హీరో మేల్కొనకపోతే డేంజర్ లో పడిపోయినట్లే. ఇప్పుడు సాయి ధరమ్ తేజ పరిస్దితి అదే.

మెగా కుటుంబ అండదండలతో వారి వారసుడుగా సిని పరిశ్రమలోకి వచ్చిన  హీరో సాయిధరమ్ తేజ. ‘సుప్రీమ్’ తరువాత సాయి ధరమ్ తేజ్ కి సరైన  హిట్ ఒక్కటీ పడలేదు.  వరస పెట్టి ఆరు చిత్రాలు డిజాస్టర్లు కావడంతో తేజు మార్కెట్ బాగా పడిపోయింది.  అయితే ఈ ప్రభావం సాయి ధరమ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘చిత్రలహరి’ ఫై పడిందని సమాచారం. వారు బడ్జెట్ లో కోత పెట్టేసారట. 

వరుస హిట్లతో అతి తక్కువ సమయంలోనే తెలుగులో  అగ్ర నిర్మాణ సంస్థ గా పేరు తెచ్చుకున్న బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్. అయితే ఈ బ్యానర్ కు  గత ఏడాది చివరిలో రెండు భారీ ప్లాపులు తగిలి పెద్ద షాకే ఇచ్చాయి. దీంతో ఆ నిర్మాతలు  తమ  కొత్త సినిమాల నిర్మాణ విషయాలలో కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. హీరోల మార్కెట్ బట్టి చిత్ర బడ్జెట్ కేటాయించాలని, అంతకు మించి పైసా కూడా ఖర్చు పెట్టకూడదని  డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. అందులో భాగంగానే తాజాగా సాయి ధరమ్  తేజు తో చేస్తున్న చిత్రలహరి బడ్జెట్ లో 5 కోట్లు తగ్గించారని ఫిల్మ్ నగర్ సమాచారం.

ముందుగా ఈ చిత్రానికి 20కోట్ల బడ్జెట్ అనుకున్నారట కాని తేజు మార్కెట్ చూసి 15కోట్ల వరకే కేటాయించేలా ఫిక్స్ అయ్యారట మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు. ఇక ఈసినిమా థియేట్రికల్ హక్కులను కూడా రీజనబుల్ రేట్స్ కు అమ్మి శాటిలైట్ , డిజిటల్ రైట్స్ తో లాభాలు రాబట్టాలన్న ఆలోచనలో వుంది మైత్రి.

కిశోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో కళ్యాణి ప్రియదర్శన్ ,నివేత పేతురాజ్ కథానాయికలుగా నటిస్తుండగా ప్రముఖ నటుడు సునీల్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదలకానుంది.

click me!