ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్దాయిలో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్దాయిలో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. యు.వి. క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం టార్గెట్ ఏమిటి...ఏ చిత్రం కలెక్షన్స్ ని దాటాలి అనేది ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సాహో చిత్రం మన తెలుగు రాష్ట్రాల్లో ప్రక్కన పెడితే ..ఇండియా వైజ్ రికార్డ్ లు క్రియేట్ చేయటానికి ఎదురుచూస్తోంది. ఇందులో భాగంగా సాహో తొలి టార్గెట్...ఈ సంవత్సరంలో మన దేశంలో ఎక్కువ కలెక్ట్ చేసిన చిత్రమే అవుతుంది. ఆ చిత్రం కలెక్షన్స్ దాటి మొదట రికార్డ్ ని క్రియేట్ చేయాలి. ఆ చిత్రం మరేదో కాదు కబీర్ సింగ్.
తెలుగులో వచ్చి హిట్టైన అర్జున్ రెడ్డి రీమేక్ గా వచ్చిన కబీర్ సింగ్ చిత్రం హిందీలో ఘన విజయం సాధించింది. ఈ సినిమా కు సందీప్ వంగా డైరక్ట్ చేసారు. 273 కోట్ల గ్రాస్ ఈ సినిమా తెచ్చిపెట్టింది. దాంతో ఈ సినిమా కలెక్షన్స్ ని దాటాల్సిన టార్గెట్ ...సాహోకు ఫిక్సైంది. అప్పుడు ఈ సంవత్సరం ఇండియాలో హైయిస్ట్ గ్రాసర్ సినిమా అవుతుంది. దేశభక్తి చిత్రం యురి 250 కోట్ల దగ్గరే ఆగిపోయింది. సల్మాన్ ఖాన్ భారత్ చిత్రం 201 కోట్ల దగ్గరే ఆగిపోయింది. కాబట్టి సాహోకు కబీర్ సింగే మెయిన్ టార్గెట్.