‘సాహో’కొత్త రిలీజ్ డేట్..అఫీషియల్ ప్రకటన వచ్చేసింది

By tirumala ANFirst Published Jul 19, 2019, 10:40 AM IST
Highlights

‘బాహుబలి’ 1, 2 సూపర్ హిట్స్ తర్వాత రిలీజ్ కాబోతున్న  ‘సాహో’ చిత్రంపై  ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠ రోజు రోజుకు పెరిగిపోతోంది.

‘బాహుబలి’ 1, 2 సూపర్ హిట్స్ తర్వాత రిలీజ్ కాబోతున్న  ‘సాహో’ చిత్రంపై  ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠ రోజు రోజుకు పెరిగిపోతోంది. అయితే నిర్మాతలు మాత్రం దాన్ని పట్టించుకోకుండా రిలీజ్ డేట్ లను మార్చుకుంటూ పోతున్నారు. ఇంతకాలం ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న విడుదల చేస్తామని ఇప్పటి వరకు చిత్రయూనిట్ చెప్తూ వచ్చింది. కానీ ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కావడం లేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రాన్ని ఆగస్ట్ 30న విడుదల చేయబోతున్నట్లుగా అఫీషియల్ గా ప్రకటన చేసారు. క్వాలిటీలో కాంప్రమైజ్ కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు చెప్తున్నారు. 

యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో వంశీ, ప్రమోద్, విక్కీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ర‌న్‌ రాజా రన్’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న సుజీత్ ఈ చిత్రానికి దర్శకుడు. 

భారీ తారాగణం నటిస్తున్న దీంతో ఇప్పటి వరకు ‘సాహో’ విడుదలను దృష్టిలో పెట్టుకుని వాయిదా పడిన చిత్రాలన్నీ ఈ ఆగస్ట్ 15కు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే శర్వానంద్ ‘రణరంగం’, అడవి శేష్ ‘ఎవరు’ చిత్రాలు ఆగస్ట్ 15న విడుదల అవుతున్నట్లుగా అఫీషియల్‌గా ప్రకటించారు. 

 

No compromise on the content and quality!
The action begins in cinemas from 30th Aug. releasing worldwide on 30.08.2019. pic.twitter.com/Clne9tuiVS

— UV Creations (@UV_Creations)
click me!