ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్` చిత్రం మూడేళ్ల క్రితం థియేటర్లోకి వచ్చి ఆకట్టుకుంది. స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొనడానికి ముందు అల్లూరి సీతారామరాజు, కొమురంభీమ్ చేసిన పోరాటం నేపథ్యంలో సాగే కథతో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని సాధించింది. ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో రికార్డుని క్రియేట్ చేసింది. అదేంటో చూద్దాం.
ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన `ఆర్ఆర్ఆర్` మూవీ మూడేళ్ల క్రితం విడుదలై ఆకట్టుకుంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.1200కోట్లు వసూలు చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ భారీ వసూళ్లని రాబట్టింది. అయితే మేకర్స్ ఆశించిన టార్గెట్ రీచ్ కాలేదు. దాదాపు రూ.1500కోట్లకుపైగా వసూళ్లని రాబడుతుందని, `బాహుబలి 2`ని రీచ్ అవుతుందని భావించారు. కానీ ఆ విషయంలో డిజప్పాయింట్ చేసింది.
సినిమాకి ఇండియన్ ఆడియెన్స్ నుంచి, ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ నుంచి కొంత పెదవి విరుపు కనిపించింది. అయినా బాగానే ఆడింది. అయితే `ఆస్కార్`తో అన్ని అసంతృప్తులను బ్రేక్ చేసింది.ఈ చిత్రం `నాటు నాటు` పాటకి గానూ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డుని సాధించిన విషయం తెలిసిందే. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, `నాటు నాటు` పాట రచయిత చంద్రబోస్ ఆస్కార్ అందుకున్నారు.
డైరెక్ట్ ఇండియన్ మూవీకి టెక్నీకల్ విభాగంలో ఆస్కార్ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. అలా `ఆర్ఆర్ఆర్` మూవీ ఇండియన్ సినిమాలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఇప్పుడు మరో రికార్డులు సొంతం చేసుకుంది. ఈ మూవీ జపాన్లో సంచలనంగా మారింది. ఆ దేశంలో ఏడాదికిపైగా ఆడిన సినిమాగా `ఆర్ఆర్ఆర్` నిలవడ విశేషం. అంతేకాదు కలెక్షన్ల విషయంలోనూ భారీ వసూళ్లని రాబట్టింది.
జపాన్ దేశంలో `ఆర్ఆర్ఆర్` మూవీ ఏడాదికిపైగా ప్రదర్శించడంతోపాటు మన ఇండియన్ రూపీ ప్రకారం అక్కడ ఈ చిత్రం ఏకంగా రూ.150కోట్లు(2.5 బిలియన్స్ జపాన్ యీన్స్) వసూలు చేసిందట. దీంతో ఇది జపాన్ లో అత్యధిక వసూళ్లని రాబట్టిన ఇండియన్ మూవీగా నిలిచింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించారు. ఆయనకు జోడీగా అలియాభట్, బ్రిటీష్ నటి ఒలివియా నటించారు. అజయ్ దేవగన్, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు.