
రామ్ గోపాల్ వర్మ (RGV) ఏం చేసినా సంచలనమే అవుతూండటం సహజం. వివాదాల దగ్గరినుంచి సినిమాలు చేసే వరకు ప్రతి దాన్ని కూడా అయన అందరు మాట్లాడుకునేలా చేస్తుంటాడు. తాజాగా ఆయన ప్రభాస్ చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఓ మేరకు ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో సర్కులేట్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..
ప్రభాస్ హీరోగా ప్రముఖ దర్శకుడు మారుతి డైరక్షన్ లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపుగా మారుతీ 45 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయని చెప్పాలి. ఈ సినిమా కోసం మేకర్స్ అన్నపూర్ణ 7 యాక్టర్స్ స్టూడియోలో ఒక 19వ శతాబ్దానికి చెందిన బిల్డింగ్ సెట్ కూడా నిర్మించి షూట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించాడు మారుతి. ఈ సినిమాలో ఓ గెస్ట్ అప్పియరెన్స్ వేషం ఉందని సమాచారం. దానికి రాంగోపాల్ వర్మ అయితే బాగుంటుందని భావించి వర్మను సంప్రదించడం జరిగిందట.
అందుకు రామ్ గోపాల్ వర్మ ఓకే చెప్పారు. అయితే ఆ పాత్రని రిలీజ్ దాకా రివీల్ చేయకూడదని టీమ్ డిసైడ్ అయ్యిందిట. వర్మ గెస్ట్ అప్పియరెన్స్ అయినప్పటికీ ప్రేక్షకులకు షాకింగ్ అనే అంటున్నారు. అయితే ఆ గెస్ట్ రోల్ ఏమిటి అన్నది మాత్రం రివీల్ చేయడం లేదు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్దత్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ తాతగా సంజయ్ దత్ కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. తాతా మనవళ్ల అనుబంధం ఈ సినిమాలో మెయిన్ పాయింట్గా ఉంటుందని తెలిసింది.
పరిమిత బడ్జెట్లో పాన్ ఇండియన్ లెవెల్లో ఈసినిమాను రూపొందిస్తున్నారు. రాజా డీలక్స్ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సంవత్సరం చివర్లో ప్రభాస్- మారుతి సినిమాప్రేక్షకుల ముందుకు రానుంది. రాజా డీలక్స్తో పాటు ప్రభాస్ నటించిన ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ సినిమాలు కూడా ఈ ఏడాది రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రభాస్ ఏకకాలంలో పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆదిపురుష్ చిత్రాన్ని పూర్తి చేసాడు. ఇక ఇప్పుడు రాజా డీలక్స్ షూటింగ్ జరుగుతోంది. అలాగే ప్రాజెక్ట్ – K , సలార్ షూటింగ్ లను కూడా ఇదే సమయంలో చేస్తున్నాడు.