రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తానంటున్న జూనియర్ త్రిషా

First Published Mar 12, 2018, 5:32 PM IST
Highlights
  • ఒక ప్రముఖ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి వస్తాను
  • .ప్రజల సమస్యల పరిష్కారం కోసం నా వంతు పాత్రను పోషిస్తానుంటున్న రేష్మా

 తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలకు పెద్దపీట వేసింది మహానటుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ . అప్పట్లో టీడీపీ పార్టీ పెట్టిన తొమ్మిది నెలలోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు. ఎన్టీఆర్ తర్వాత పార్టీ పెట్టి దుకాణం సద్దేసిన వాళ్లు చాలా మందే ఉన్నారు. ఈ రోజుల్లో సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న ప్రముఖ హీరోయిన్ రేష్మా .రేష్మా ఆదివారం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు.

ఈ క్రమంలో ఆమె ఒక ప్రముఖ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి వస్తాను .ప్రజలకు సేవ చేయాలనీ ఉంది.ప్రజల సమస్యల పరిష్కారం కోసం నా వంతు పాత్రను పోషిస్తాను.ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి తన ఎంట్రీ ఉంటుందని ఆమె కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు.అయితే ఏ పార్టీలోకి చేరతారో మాత్రం చెప్పలేదు.

tags
click me!