ఆ వ్యక్తి నా వెనకుంటే.. ఏదీ నన్ను బాధించదు: రేణు దేశాయ్

By Surya PrakashFirst Published Jul 13, 2021, 12:58 PM IST
Highlights

ఇటీవల రేణు దేశాయ్‌ సైతం.. మంచి పాత్రలు వస్తే తాను నటించడానికి సిద్ధంగా ఉన్నానని ఓ ఈవెంట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆమె వ్యవసాయం, రైతులకు సంబంధించిన కథతో ఓ సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే.

నటి రేణూ దేశాయ్‌ సోషల్‌మీడియా వేదికగా ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ బిజీగా ఉంటారు.  తన బహుముఖ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు రేణు దేశాయ్‌. వృత్తి పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు రేణు. ముఖ్యంగా పిల్లలే ప్రపంచంగా జీవిస్తోన్న రేణు దేశాయ్‌ తన పిల్లలతో సరదాగా గడుపుతారు. కొన్ని సందర్భాల్లో రేణు దేశాయ్ చిన్నారులతో కలిసి విదేశాలకు కూడా వెళుతుంటారు. ఈ క్రమంలోనే కుమారుడు అకీరా నందన్‌, కూతురు ఆద్యాతో కలిసి దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో అభిమానులతో షేర్‌ చేస్తుంటారు రేణు దేశాయ్‌. తాజాగా అలా ఆమె ఇనిస్ట్రలో చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.

  కుమారుడు అకీరా నందన్‌తో దిగి ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు రేణు. అకీరా.. తన వెనకాల నిల్చొని ఉన్న సమయంలో సెల్ఫీ ఫొటో తీసుకున్న రేణు ఆ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ ఫొటోకు.. ‘ఈ అద్భుతమైన వ్యక్తి (అకీరాను ఉద్దేశిస్తూ)నా వెనకాల ఉన్నంత వరకు నన్ను ఈ ప్రపంచంలో ఏదీ బాధించలేదు’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్‌ జోడించారు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. 

ఇక చాలా రోజుల తర్వాత అకీరాకు సంబంధించిన మరో ఫొటో బయటకు వచ్చింది. ఇందులో అకీరా మరింత ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు.  ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల క్రితం రేణు కూతురు ఆద్యా ఫొటోను కూడా షేర్‌ చేశారు. మొహానికి పెట్టుకోవాల్సిన మాస్క్‌ను తలకు పెట్టుకున్న ఆద్య ఫన్నీ ఫొటోను రేణు షేర్‌ షేర్‌ చేశారు.

https://www.instagram.com/p/CQ6B2ogBexR/?utm_source=ig_embed&ig_rid=29d8ea77-24ac-4e85-85c5-c7a6a16d3530
 

click me!