బలుపు దర్శకుడితో మాస్ రాజా న్యూ ప్రాజెక్ట్!

By Prashanth MFirst Published May 26, 2019, 1:02 PM IST
Highlights

మాస్ మహారాజ రవి తేజ - గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ విషయంపై దర్శకుడు గోపీచంద్ తిరుమలలో క్లారిటీ ఇచ్చేశాడు.

మాస్ మహారాజ రవి తేజ - గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ విషయంపై దర్శకుడు గోపీచంద్ తిరుమలలో క్లారిటీ ఇచ్చేశాడు. గత కొంత కాలంగా ఈ కాంబినేషన్ పై అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు దర్శకుడు మాస్ రాజాతో వర్క్ చేస్తున్నట్లు చెప్పాడు. 

డాన్ శీను సినిమాతో దర్శకుడిగా పరిచయమైన డైరెక్టర్ గోపీచంద్ ఆ తరువాత రవితేజతో బలుపు అనే సినిమా చేశాడు. రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్కవ్వడంతో గోపి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే పండగ చేస్కో - విన్నర్ సినిమాలు ఈ దర్శకుడిని కాస్త దెబ్బేశాయి. 

తనకు ఎప్పటినుంచో పరిచయమున్న మాస్ రాజాతో ఎట్టకేలకు ఒక సినిమా చేయడానికి ముహూర్తం సెట్ చేసుకున్నాడు. త్వరలోనే సినిమాకు సంబందించిన పూర్తి వివరాలను తెలియజేస్తానని దర్శకుడు వివరణ ఇచ్చాడు. 

click me!
Last Updated May 26, 2019, 1:02 PM IST
click me!