మాస్ మహారాజ రవి తేజ - గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ విషయంపై దర్శకుడు గోపీచంద్ తిరుమలలో క్లారిటీ ఇచ్చేశాడు.
మాస్ మహారాజ రవి తేజ - గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ విషయంపై దర్శకుడు గోపీచంద్ తిరుమలలో క్లారిటీ ఇచ్చేశాడు. గత కొంత కాలంగా ఈ కాంబినేషన్ పై అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు దర్శకుడు మాస్ రాజాతో వర్క్ చేస్తున్నట్లు చెప్పాడు.
డాన్ శీను సినిమాతో దర్శకుడిగా పరిచయమైన డైరెక్టర్ గోపీచంద్ ఆ తరువాత రవితేజతో బలుపు అనే సినిమా చేశాడు. రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్కవ్వడంతో గోపి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే పండగ చేస్కో - విన్నర్ సినిమాలు ఈ దర్శకుడిని కాస్త దెబ్బేశాయి.
తనకు ఎప్పటినుంచో పరిచయమున్న మాస్ రాజాతో ఎట్టకేలకు ఒక సినిమా చేయడానికి ముహూర్తం సెట్ చేసుకున్నాడు. త్వరలోనే సినిమాకు సంబందించిన పూర్తి వివరాలను తెలియజేస్తానని దర్శకుడు వివరణ ఇచ్చాడు.