రంగస్థలం సెకండ్ సాంగ్ దేేవీ అదరగొట్టాడు

First Published Mar 1, 2018, 11:16 AM IST
Highlights
  • రామ్ చరణ్ రంగస్థలం  తొలి పాటకు కోటి వ్యూస్ ను దాటి దుమ్ముదులిపింది.
  • ఇప్పడు ఈ చిత్రం నుంచి రెండో పాటను ఇచ్చేందుకు మేకర్స్ ఫిక్స్ అయ్యారు​.

రామ్ చరణ్ మూవీ రంగస్థలం నుంచి విడుదల అయిన తొలి పాటకు ఎంతగా రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఇప్పటికే కోటి వ్యూస్ ను దాటి దుమ్ముదులిపింది. ఇప్పడు ఈ చిత్రం నుంచి రెండో పాటను ఇచ్చేందుకు మేకర్స్ ఫిక్స్ అయ్యారు. 'రంగా రంగా రంగస్థలాన' అంటూ రెండో సాంగ్ సాగనుండగా.. రేపు సాయంత్రం 6 గంటలకు ఈ పాట రిలీజ్ అవుతుందంటూ ఓ టీజర్ ఇచ్చారు. 

మొదటగా శ్రీదేవికి నివాళులు అర్పిస్తూ.. సెకండ్ సింగిల్ స్నీక్ పీక్ పేరుతో రిలీజ్ అయిన ఈ ప్రోమోను డిజైన్ చేసిన విధానం అద్భుతంగా ఉంది.తొలిపాటకు అంతటి రెస్పాన్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు దర్శకుడు అండ్ సంగీత దర్శకుడు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. దేవిశ్రీ ప్రసాద్ తన స్టైల్ లో పాటను మొదలుపెట్టాడు. సినిమా నుంచి విజువల్స్ ఏమీ చూపించకపోయినా.. మూవీ యూనిట్ తోనే డ్యాన్స్ వేయించిన తీరు మాత్రం సూపర్బ్ గా ఉంది. పాట ట్యూన్ కూడా అద్భుతంగా ఉంది.  తన సంగీతంతో డీఎస్పీ మరోసారి అలరించనున్నాడనే సంగతి అర్ధమవుతోంది. 30 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులకు తగినట్లుగా డీఎస్పీ కొట్టిన మ్యూజిక్ అద్భుతంగా ఉంది. 

 

                                                      

click me!