ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా `స్పిరిట్` అనే మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది.
ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన సందీప్రెడ్డి వంగా మూవీ చేయబోతున్నారు. `స్పిరిట్` పేరుతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారట. ఇందులో ప్రభాస్ పోలీస్ పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. హిందీ ప్రొడక్షన్ నిర్మించే ఈ మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించేందుకు సందీప్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన `యానిమల్` మూవీని తెరకెక్కించారు. ఇది డిసెంబర్ 1న విడుదల కానుంది.
ఈ ట్రైలర్ సంచలనంగా మారింది. అంచనాలను పెంచుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా `యానిమల్` టీమ్ రష్మిక మందన్నా, రణ్బీర్ కపూర్, సందీప్రెడ్డి వంగా.. బాలయ్య హోస్ట్ గా చేస్తున్న `అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే` మూడో సీజన్లో పాల్గొన్నారు. ఇందులో వీరి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఈ క్రమంలో బాలకృష్ణ ఆసక్తికర ప్రశ్న అడిగారు. తెలుగులో ఇష్టమైన స్టార్ ఎవరు అని అడగ్గా.. రణ్బీర్.. సందీప్ పేరు మెన్షన్ చేశారు.
ఆ తర్వాత ప్రభాస్ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు సందీప్ నెక్ట్స్ ప్రభాస్ అన్నతో సినిమా చేస్తున్నారు. ఆయన సినిమాలో చిన్న రోల్ ఇస్తే థ్రిల్ హ్యాపీ అవుతాను. `స్పిరిట్`లో భాగమైనందుకు థ్రిల్ ఫీలవుతాను అని తెలిపారు. రణ్బీర్ కపూర్ లాంటి స్టార్ హీరో ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ అభిమానుల మనసులను ఆయన దోచుకున్నారని చెప్పొచ్చు.
ఈ సందర్భంగా ప్రభాస్ సినిమా అప్డేట్ అడిగాడు బాలకృష్ణ. తన మనవడు దేవాన్ష్ ప్రభాస్ `స్పిరిట్` సినిమా ప్రారంభం కోసం ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారని, షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందని అడగ్గా.. సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్తుందని తెలిపారు. దీనిపై మరో ఇంటర్వ్యూలో నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడుతూ, `యానిమల్` సినిమా విడుదలయ్యాక ఓ ఆరు నెలలు గ్యాప్ తీసుకుని ప్రభాస్ మూవీని ప్రారంభిస్తామని చెప్పారు.