
రవితేజ హీరోగా, దివ్యాంశ కౌషిక్, హీరో హీరోయిన్లు గా.. వేణు తొట్టెంపూడి ఇంపార్టెంట్ రోల్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవా తన ఎఫెట్ అంతా పెట్టి.. ఈ సినిమాను రూపొందించాడు. ఈ సినిమాపైనే ఎన్నో ఆశలు పెట్టుకుంది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 29న శుక్రవారం రిలీజ్ కాబోతోంది.
శరత్ మండవ మొట్ట మొదటి సారి ఈ సినిమాతోనే దర్శకుడిగా తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు. అయితే డైరెక్టర్ గా కాకపోయినా.. శరత్ మండగా మొదటి నుంచీ.. ఇండస్ట్రీలో వివిధ విభాగాలలో పనిచేశాడు. ఎన్నో కష్టాలు పడి తను అనుకున్ డైరెక్టర్ స్థానానికి వచచాడు. ఈ విషయాలు స్వయంగా శరత్ వెల్లడించారు.
సినిమాల పట్ల ప్యాషన్ తో సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి పెట్టి ఫిల్మ్ ఇండస్ట్రీకి వైపు వచ్చాడు శరత్ మండవ. కమల్ ప్రొడక్షన్ హౌస్ లో దర్శకత్వ విభాగంలో పనిచేశాడు. ప్రభాస్ బిల్లా 2 వంటి సినిమాలకు కథ .. స్క్రీన్ ప్లే అందించాడు. తమిళంలో ఆ మధ్య వచ్చిన 'కో 2' సినిమాకి దర్శకత్వం వహించాడు. అంతే కాదు సినిమాటోగ్రాఫర్ గా కూడా పని చేసిన అనుభవం ఉంది శరత్ మండవకు.
ఇక ఇండస్ట్రీకి రాకముందే నిర్మాత సుధాకర్ చెరుకూరితో శరత్ కి మంచి స్నేహం ఉందట. ఆ స్నేహమే ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేయడానికి పునాది పడేలా చేసిందన్నారు శరత్. . రచయితగా, కెమెరామెన్ గా , దర్శకుడిగా ఉన్న అనుభవం నిర్మాతలో పాటు అందరికి తనపై ఉన్న నమ్మకాన్ని పెంచింది. అంతే కాదు సినిమా సక్సెస్ విషయంలో కూడా అదే నమ్మకంతో ఉన్నారు శరత్. రవితేజతో పని చేయడం తనకు ఉత్సాహాన్నిచ్చిందన్నారు.