
వివాదాస్పద, సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఏం మాట్లాడినా అది సంచలనమే. అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంటారు. ఊహించని పోస్ట్ లతో, ఊహించని కామెంట్లతో ఆయన పరిస్థితులను మరింత ఆసక్తికరంగా మారుస్తుంటారు. చర్చనీయాంశం చేస్తారు. తాజాగా RGV తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి(Revanth Reddy)తో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. అంతేకాదు ఇందులో `తెలంగాణలోని రియల్ టైగర్` అంటూ పోస్ట్ పెట్టారు. ఇది ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. వైరల్ అవుతుంది.
అయితే దీనికి కొండా సురేఖ స్పందించింది. వర్మ పోస్ట్ ని ఉద్దేశించి ఆమె రియాక్ట్ అవుతూ, `ఇద్దరు విభిన్న ప్రజాదరణ పొందిన వ్యక్తులు కలిసి తెలంగాణలో అపరిమితమైన శక్తిగా మారగలరు` అని ట్వీట్ చేసింది. వర్మని ట్యాగ్ చేసింది. దీనికి ఆర్జీవీ స్పందించారు. అందుకు కేవలం ఒక్క రేవంత్రెడ్డి చాలు అంటూ రిప్లై ఇవ్వడం విశేషం. ఓ వైపు రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీ ఫ్లీనరీ జరుగుతున్న సమయంలో వర్మ.. ఇలా రేవంత్రెడ్డిపై ప్రశంసలు కురిపించడం ఆద్యంతం చర్చనీయాంశంగా మారింది.
అయితే గతంలోనూ ఓ సందర్భంలో రేవంత్రెడ్డిపై ప్రశంసలు కురిపించారు రామ్గోపాల్ వర్మ. ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంలోనూ రియాక్ట్ అయ్యారు. అప్పట్లో కూడా రేవంత్రెడ్డిని టైగర్గా అభివర్ణించారు. మళ్లీ ఇప్పుడు మరోసారి ఆయన్ని కలిసిన సందర్భంగా ఇలాంటి పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్ అవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో, టీఆర్ఎస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో వర్మ.. రేవంత్రెడ్డితో కలిసి ఫోటో దిగడం, దాన్ని పోస్ట్ చేస్తూ ఆయన్ని తెలంగాణ టైగర్గా వర్ణించడం హాట్ టాపిక్ అవుతుంది.
ఇదిలా ఉంటే రామ్గోపాల్ వర్మ ప్రస్తుతం కొండా సురేఖ, కొండా మురళీ జీవిత కథలతో `కొండా` చిత్రాన్ని రూపొందించారు. త్రిగుణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్ర ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంది. సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోన్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. మరోవైపు వర్మ ఇటీవల ఉపేంద్రతో `ఆర్ః ది డెడ్లీయెస్ట్ గ్యాంగ్స్టర్ ఎవర్` అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు.