నా గదిని గర్ల్స్ హాస్టల్ చేశారు.. వర్మ కామెంట్స్!

By AN TeluguFirst Published May 28, 2019, 4:55 PM IST
Highlights

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా విజయవాడకు వెళ్లారు. 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా విజయవాడకు వెళ్లారు. తను చదువుకున్న సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ని సందర్శించిన ఆయన తను రెండేళ్ల పాటు ఉన్న రూమ్ చూడడానికి వెళ్లాడు. అయితే ఇప్పుడు ఆ గది గర్ల్స్ హాస్టల్ అయిపోయిందని తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. 

ఇదిగో ఈ లవ్ లీ గర్ల్స్ ఇప్పుడు గదిలో రూమ్మేట్స్ గా ఉంటున్నారని వారితో దిగిన ఫోటోని షేర్ చేశారు. తను నిలుచున్న వెనకే శ్రీదేవి ఫోటో ఒకటి ఉండేదని, దాన్ని తనే అతికించినట్లు గుర్తుచేసుకున్నారు.

ఇది ఇలా ఉండగా.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వర్మ తన పంతాన్ని నెగ్గించుకున్నాడు. పైపుల రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వర్మ.. ఎన్టీఆర్ ఆశీస్సులతో తన పంతం గెలిచిందని అన్నారు.

వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఏపీలో మినహా అన్ని ప్రాంతాల్లో విడుదలైంది. ఎన్నికల నేపధ్యంలో ఏపీలో సినిమా విడుదల కానివ్వలేదు. ఫైనల్ గా మే 31న ఈ సినిమాను ఏపీలో విడుదల చేయనున్నారు. 

 

This is a room i stayed for more than 2 years in Siddhardha engineering college hostel back in my student days ..it has now become a girls hostel and these lovely girls are it’s present room mates ..I used to have a Sridevi poster stuck on the wall behind me 😍😍😍 pic.twitter.com/J0djoonrl1

— Ram Gopal Varma (@RGVzoomin)
click me!