తండ్రి కొడుకులని డైరెక్ట్ చేయబోతున్న కొరటాల?

Published : Jul 30, 2019, 09:05 PM IST
తండ్రి కొడుకులని డైరెక్ట్ చేయబోతున్న కొరటాల?

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఏసీ చిత్రం తర్వాత చిరు క్రేజీ డైరెక్టర్ కొరటాల దర్శత్వంలో నటించబోతున్నాడు. ఈ చిత్రం కోసం కొరటాల శివ చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఆగష్టు 22న చిరంజీవి పుట్టినరోజు పురస్కరించుకుని ఈ చిత్రాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. 

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఏసీ చిత్రం తర్వాత చిరు క్రేజీ డైరెక్టర్ కొరటాల దర్శత్వంలో నటించబోతున్నాడు. ఈ చిత్రం కోసం కొరటాల శివ చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఆగష్టు 22న చిరంజీవి పుట్టినరోజు పురస్కరించుకుని ఈ చిత్రాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ చిత్రానికి కూడా రాంచరణే నిర్మాత. తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర వార్త ప్రచారం జరుగుతోంది. సందేశాత్మక కథతో సాగే ఈ చిత్రంలో రాంచరణ్ గెస్ట్ రోల్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఖైదీ నెం 150లో రాంచరణ్ ఓ సాంగ్ లో మెరుస్తాడు. అలా ఈ చిత్రంలో సరదా కోసం చరణ్ నటించడం లేదట. 

రాంచరణ్ పాత్ర నిడివి తక్కువ అయినప్పటికీ కథలో కీలకంగా ఉంటుందని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొరటాల, చిరు చిత్రం గురించి అన్ని విషయాలు వివరంగా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 

PREV
click me!

Recommended Stories

చిరు, చరణ్, పవన్, సూర్య తో పాటు అల్లు శిరీష్ పెళ్లిలో సందడి చేసిన తారలు ఎవరెవరో తెలుసా?
Dhurandhar 2: అడ్వాన్స్ బుకింగ్స్ లో ధురంధర్‌ 2 సంచలనం.. యానిమల్‌, జవాన్‌ రికార్డులు బ్రేక్‌?