రీమేక్ లకు నేను పెడుతున్న కండీషన్ అదే : రామ్ చరణ్

By Surya PrakashFirst Published Nov 30, 2022, 4:05 PM IST
Highlights

రీమేక్ సినిమాలు అంటే ఓ కొత్త సమస్య వచ్చి పడుతోంది. ఆ సినిమాలు ముందుగా ఓటిటిలో ప్రత్యక్షమవుతున్నాయి.


 తెలుగులో ఇప్పుడు రీమేక్ ట్రెండ్ నడుస్తోంది. మళయాళ, తమిళ భాషల్లో చిత్రాలు వరసపెట్టి సినిమాలు రీమేక్ అవుతున్నాయి. దాదాపు అందరు హీరోలూ రీమేక్ లు అంటే ఉత్సాహం చూపిస్తున్నారు. మినిమం గ్యారెంటీ ఉంటుందని నమ్ముతున్నారు. రీసెంట్ గా చిరంజీవి లూసీఫర్ రీమేక్ గా గాఢ్ ఫాధర్ చిత్రం రీమేక్ చేసారు. పవన్ కళ్యాణ్ సైతం రీమేక్ లు అంటే ఉత్సాహం చూపిస్తున్నారు. 

కాకపోతే ఇప్పుడు రీమేక్ సినిమాలు అంటే ఓ కొత్త సమస్య వచ్చి పడుతోంది. ఆ సినిమాలు ముందుగా ఓటిటిలో ప్రత్యక్షమవుతున్నాయి. ఫలానా హీరో ఈ సినిమా రీమేక్ చేస్తున్నారంటే జనం ఎగబడి ఆ సినిమా చూస్తున్నారు. దాంతో ఆల్రెడీ చూసేసిన సినిమాని థియేటర్ లో చూడటానికి చాలా మంది ఆసక్తి చూపడటం లేదు. చూసినా..పోలిక పెడుతూ పోస్ట్ లు పెడుతున్నారు. వీటిని బ్రేక్ చేయటానికి రామ్ చరణ్ ఓ తెలివైన నిర్ణయం తీసుకున్నారు. 

"నేను కనక రీమేక్ చేస్తే ఒరిజనల్ చిత్ర నిర్మాతను ..ముందు ఆ సినిమాను ఓటిటి లో రిలీజ్ చేయకూడదనే కండీషన్ పెడతాను. దానికి ఒప్పుకుంటేనే  రీమేక్ చేస్తాను. లేకపోతే నేను ఒరిజనల్ స్క్రిప్టులు తోనే ముందుకు వెళ్తాను " అంటున్నారు #Ramcharan

ఇక  రామ్ చరణ్ తాజా చిత్రం విషయానికి వస్తే... దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబోలో ఓ సినిమా తెరుకెక్కుతోంది. రామ్ చరణ్ కు ఇది 15వ సినిమా. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది. 'వినయ విధేయ రామ' తర్వాత చరణ్, కియారా జంటగా నటిస్తున్న రెండో చిత్రం ఇది. ఇందులో భాగంగా ఓ పాటను శంకర్ న్యూజిలాండ్ లో చిత్రీకరించారు. దాదాపు రూ. 15–20 కోట్ల ఖర్చుతో ఈ డ్యూయెట్ ను చిత్రీకరించారు.  

న్యూజిలాండ్ లో అత్యంత అందమైన ప్రదేశాల్లో చెర్రీ, కియారా జంటపై చిత్రీకరించిన ఈ డ్యూయెట్ చిత్రానికి హైలైట్ గా ఉంటుందని అంటున్నారు. దాదాపు పది రోజుల పాటు ఆ పాట చిత్రీకరణ జరిగింది. ఈ విషయాన్ని రామ్ చరణ్ వెల్లడించారు. న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తయిందని ట్వీట్ చేశాడు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని చెప్పాడు. తమన్ అద్భుతమైన బాణీలు అందించాడని, శంకర్ బాగా తీశాడని రామ్ చరణ్ పేర్కొన్నాడు. షూటింగ్ పూర్తయిన తర్వాత కేక్ కట్ చేసి చిత్ర బృందం సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలను షేర్ చేశాడు. ఇందులో చరణ్, కియారా లుక్స్ సూపర్ గా ఉన్నాయనే టాక్ నడుస్తోంది.
 

click me!