రామ్ చరణ్ తో సినిమా షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు డైరెక్టర్ శంకర్. ఈ మధ్య భారతీయుడు2 షూటింగ్ కోసం చరణ్ సినిమాకు బ్రేక్ ఇచ్చిన శంకర్ ఎట్టకేలకు న్యూజిలాండ్ షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు.
రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న సినిమా ఆర్సీ 15 . పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీ మేజర్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. గత కొన్ని రోజులుగా న్యూజిలాండ్ లో కీలక షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈమూవీ.. అక్కడ పని ముగించుకున్నట్టు తెలుస్తోంది.
అయితే తాజాగా న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది ఆర్.సి15 టీమ్. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ తో పాటు రాంచరణ్ టీం ట్విటర్ ద్వారా షేర్ చేసుకుంది. లొకేషన్లో టీం మెంబర్స్ కేక్ కట్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసంది. ఈ ఫొటోలు ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
And it’s a wrap in New Zealand 🇳🇿
song & it’s visuals are fabulous 🎶 garu, & made it even more special. stunning as always👌 u nailed it again👍 thank you fr amazing looks. pic.twitter.com/1VJ9icH7VK
ఇక అక్కడ కీలక షూటింగ్ షెడ్యూల్ పూర్తి అవ్వడంతో రామ్ చరణ్ కూడా హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అయినట్టు ఇన్సైడ్ టాక్. న్యూజిలాండ్ షెడ్యూల్ తో దాదాపు 75 శాతానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కొన్న సన్నీవేశాలు మాత్రం పెండింగ్ ఉన్నాయి. నెక్ట్స్ రెండ షెడ్యూల్స్ లో సినిమా కప్లీట్ చేసే అవకాశం ఉంది.
ఇక ఈసినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఈ సినిమాలో రామ్ చరణ్ జోడీగా నటిస్తుంది. వీరిద్దరి కాంబోలో గతంలో టాలీవడ్ నుంచి వినయ విధేయ రామ రాగా అది ప్లాప్ అయ్యింది. అయినా సరే కియారాకు మంచిపేరు తీసుకువచ్చింది సినిమా. ఇక వీరితో పాటు అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, సునీల్, జయరాయ్ ఇతర కీ రోల్స్ పోషిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆర్సీ 15 మూవీకి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా..సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఆచార్యతో ప్లాప్ ఫేస్ చేసిన రామ్ చరణ్ ఈ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ సాధించాలని చూస్తున్నాడు. చరణ్ ఫ్యాన్స్ కూడా ఈసినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.