రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో `రంగస్థలం` మూవీ వచ్చి పెద్ద హిట్ అయ్యింది. ఈ కాంబినేషన్లో మరో సినిమా రాబోతుంది. హోలీ సందర్భంగా దీన్ని ప్రకటించింది యూనిట్.
రామ్చరణ్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన `రంగస్థలం` సంచలనం క్రియేట్ చేసింది. అప్పట్లో నాన్ `బాహుబలి` రికార్డులను బ్రేక్ చేసింది. అంతేకాదు ఇతర దర్శకులు కూడా ఊపు తీసుకొచ్చింది. రాజమౌళి మాత్రమే కాదు, మనం కూడా సంచలనాలు క్రియేట్ చేయోచ్చనే ధైర్యాన్నిచ్చింది. బడ్జెట్ పరిధులు పెంచింది. ఇప్పుడు ఈ కాంబోలో మరో మూవీ వస్తుంది. మరోసారి ఈ ఇద్దరు కలిసి పనిచేయబోతున్నారు. చాలా కాలంగా వీరి కాంబినేషన్లో సినిమా అనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు.
Survey:వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
కలర్పుల్ పండగ హోలీని పురస్కరించుకుని ఈ మూవీని అనౌన్స్ చేశారు. `రంగస్థలం` కాంబో రిపీట్ అనేలా హీరో, దర్శకుడు మాత్రమే కాదు, మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాణసంస్థ కూడా సేమ్ కావడం విశేషం. దీనికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు. దీనికి సుకుమార్ రైటింగ్స్ భాగం అవుతుంది.
`ఆర్ఆర్ఆర్` తర్వాత రామ్ చరణ్ రేంజ్ పెరిగింది. ఆయన గ్లోబల్ స్టార్గా రాణిస్తున్నారు. ప్రస్తుతం రూపొందిస్తున్న `గేమ్ ఛేంజర్`తో హీరోగా మరింతగా ఎదిగే అవకాశం ఉంది. అలాగే బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా కూడా భారీ స్థాయిలో ఉండబోతుంది. మరోవైపు `పుష్ప` తర్వాత ఇండియన్ సినిమా లెక్కలు మార్చేశాడు సుకుమార్. ఇప్పుడు `పుష్ప2`తో గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేశాడు. ఈ క్రమంలో అనంతరం రామ్ చరణ్ మూవీ చేయబోతుండటంతో వీరి కాంబో మూవీ మరో స్థాయిలో ఉండబోతుందని చెప్పొచ్చు.
the force reunites 💥 pic.twitter.com/yyXv7Fnx9N
— Ram Charan (@AlwaysRamCharan)`పుష్ప2` తర్వాత సుకుమార్ ఈ ప్రాజెక్ట్ పైనే ఫోకస్ పెట్టబోతున్నారు. దీన్ని ఈ ఏడాది చివర్లో ప్రారంభించి, వచ్చే ఏడాది చివర్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మూవీపై అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొంది. ఈ మూవీతో మరో ట్రెండ్ సెట్టింగ్ కంటెంట్ని ఇవ్వబోతున్నారట సుకుమార్. సినిమా కలర్నే మార్చేయబోతున్నట్టు టీమ్ ప్రకటించడం విశేషం.
Read more: అల్లు అర్జున్ ని మూడు గంటలు ఎండలో నిలబెట్టిన సుకుమార్... పుష్ప 2 అందుకే ఆలస్యం!