శ్రీవారిని దర్శించుకున్న వెంకటేష్‌ కూతురు, అల్లుడు.. ఎంత సింపుల్‌గా ఉన్నారో!

By Aithagoni RajuFirst Published Mar 25, 2024, 3:43 PM IST
Highlights

హీరో విక్టరీ వెంకటేష్‌ రెండో కూతురు హవ్య వాహిని వివాహం ఇటీవల జరిగింది. తాజాగా కొత్త శ్రీవారిని సందర్శించుకున్నారు. తిరుమల వెంకటేశ్వరుడి ఆశిస్సులు తీసుకున్నారు.
 

టాలీవుడ్‌ టాప్‌ స్టార్‌లో ఒకరైన వెంకటేష్‌ తన రెండో కూతురు పెళ్లిని ఇటీవల నిర్వహించారు. చాలా ప్రైవేట్‌గా ఈ వివాహం జరిగింది. బంధుమిత్రుల సమక్షంలోనే ఈ వివాహం జరిగింది. సినిమా సెలబ్రిటీలు కూడా హాజరు కాకపోవడం గమనార్హం. వెంకీ చాలా ప్రైవేట్‌గా ఈ వివాహం చేసే ప్రయత్నం చేశారు. 

survey:వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

గతంలో తన పెద్ద కూతురు వివాహం చేసిన వెంకటేష్‌.. ఇటీవల రెండో కూతురు హయ వాహిని వివాహం నిర్వహించారు. విజయవాడకి చెందిన డాక్టర్‌ నిశాంత్‌ పాతూరితో ఆమె మ్యారేజ్‌ జరిగింది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ మ్యారేజ్‌ చేసినట్టు సమాచారం. ఈ మేరకు అధికారికంగా కొత్త జంట ఫోటోలు విడుదల చేశారు. అవి వైరల్‌ అయ్యాయి. 

ఇక ఇప్పుడు ఈ కొత్త తిరుమల శ్రీవారిని సందర్శించుకుంటుంది. కొత్తగా పెళ్లైన నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆశిస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా వీరి వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అయితే ఆమె వెంకీ కూతురు అని తెలియకపోవడంతో చాలా సింపుల్‌గానే అక్కడిగా నుంచి పోయారు. వెంకటేష్‌కి ముగ్గురు కూతురుళ్లు, ఒక కుమారుడు అర్జున్‌ ఉన్నారు. ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్లు అవగా, మరో అమ్మాయి ఉంది. 

వెంకటేష్‌ ఈ సంక్రాంతి ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఆయన `సైంధవ్‌` చిత్రంలో నటించారు. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ పరాజయం చెందింది. ప్రస్తుతం ఆయన అనిల్‌ రావిపూడితో సినిమా చేయాల్సి ఉంది. ఈ లోపు వెంకీ `రానా నాయుడు` సీజన్‌ 2 వెబ్‌ సిరీస్‌లో నటించబోతున్నారు. ముంబాయిలో ఈ సిరీస్‌ షూటింగ్‌ జరుగుతుంది. ఈ షూటింగ్‌ అనంతరం అనిల్‌ రావిపూడి మూవీ ప్రారంభమవుతుంది. జూన్‌, జులైలో ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. 

click me!