రాజుగారి గది 3: ఓంకార్ అన్నయ్య కొత్త ప్రయోగం!

By Prashanth MFirst Published Jun 20, 2019, 10:02 AM IST
Highlights

రాజుగారి గది సినిమాకు మరో సీక్వెల్ గా రాబోతున్న సినిమా పూజా కార్యక్రమాలతో నేడు మొదలైంది. గత కొంత కాలంగా ఈ సినిమాకు సంబందించిన అనేక రూమర్స్ ఆడియెన్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. 

రాజుగారి గది సినిమాకు మరో సీక్వెల్ గా రాబోతున్న సినిమా పూజా కార్యక్రమాలతో నేడు మొదలైంది. గత కొంత కాలంగా ఈ సినిమాకు సంబందించిన అనేక రూమర్స్ ఆడియెన్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. రాజుగారి గది 3 కోసం మిల్కీ బ్యూటీ తమన్నా కోటిన్నర రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు టాక్ వచ్చింది. 

కానీ దర్శకుడు, నిర్మాత ఓంకార్ ఆమెకి నో చెప్పి వేరే హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపించాయి. అయితే ఫైనల్ గా చిత్ర యూనిట్ నేడు తమన్నా తో సినిమాను లాంచ్ చేయడంతో రూమర్స్ కి బ్రేక్ పడింది. సినిమాలో కథానాయకుడిగా అశ్విన్ నటించబోతున్నాడు. 

అన్నయ్య ఓంకార్ ఇదివరకు తెరకెక్కించిన రెండు సినిమాల్లో లీడ్ రోల్ లో కనిపించిన అశ్విన్ ఇప్పుడు రాజుగారి గది 3లో కూడా అదే రోల్ లో కనిపించబోతున్నాడు. సినిమాలో హారర్ సన్నివేశాలు ఫస్ట్ రెండు బాగాలకంటే ఎంతో ప్రయోగాత్మకంగా ఉంటాయట. దర్శకుడు ఓంకార్ ఈ కథ కోసం చాలా రోజులు స్క్రిప్ట్ డిస్కర్షన్స్ నిర్వహించాడు. 

అయితే నాగార్జున - సమంత వంటి స్టార్స్ తో తెరకెక్కించిన సెకండ్ పార్ట్ అంతగా హిట్టవ్వలేదు.మరి ఇప్పుడు తమన్నాతో చేస్తోన్న ఈ మూడవ హారర్ కాన్సెప్ట్ ఎంతవరకు హిట్టవుతుందో చూడాలి. 

click me!