తెలుగు 2.0 ప్రమోషన్స్ కోసం డబ్బు వృధా చేస్తున్నారు: రజినీకాంత్

By Prashanth MFirst Published Nov 26, 2018, 7:37 PM IST
Highlights

శంకర్ సృష్టించిన విజువల్ వండర్ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ తో ఇప్పటికే చిత్ర యూనిట్ హడావుడి మొదలైంది. తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేస్తుండడంతో ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే సినిమా కోసం ఎంతో మంది ముందు నుంచే ఎదురుచూస్తున్నారని ప్రమోషన్స్ అవసరం లేదని రజినీకాంత్ వ్యాఖ్యానించారు. 

శంకర్ సృష్టించిన విజువల్ వండర్ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ తో ఇప్పటికే చిత్ర యూనిట్ హడావుడి మొదలైంది. తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేస్తుండడంతో ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే సినిమా కోసం ఎంతో మంది ముందు నుంచే ఎదురుచూస్తున్నారని ప్రమోషన్స్ అవసరం లేదని రజినీకాంత్ వ్యాఖ్యానించారు. 

రజినీకాంత్ మాట్లాడుతూ.. మొదట శంకర్ మంచి ప్రాజెక్ట్ దొరికితే 3డి లో చేస్తానని చెప్పాడు. ఆ తరువాత 2.0 కథతో నా దగ్గరకు రాగానే ముందుగానే ఊహించా మంచి సబ్జెక్ట్ దొరికిందని. ఇక ఆయన కథ చెప్పగానే ముందుగా వర్క్ చేసిన అనుభవం ఉంది కాబట్టి తప్పకుండా సినిమా ప్రజెంటేషన్ మీద నమ్మకంతో ఒప్పేసుకున్నట్లు రజినీకాంత్ మాట్లాడారు. 

ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. సినిమాకు మంచి టెక్నీషియన్స్ మంచి కాంబినేషన్ కుదరడంతో తెరపై అద్భుతంగా వచ్చిందని అన్నారు. ఇక అక్షయ్ కుమార్ ఎంతగానో కష్టపడ్డారని ఈ కాంబినేషన్ సినిమాకు పెద్ద ప్రమోషన్ అంటూ తెలుగులో సినిమాను రిలీజ్ చేస్తోన్న బివిఎస్ఎన్. ప్రసాద్ గారు డబ్బు ను వృధా చేస్తున్నారు అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. 

ఇక చాలా కాలం తరువాత నేను కూడా ఒక సినిమా రిలీజ్ కొరకు ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు చెబుతూ 2.0 అందరికి నచ్చుతుందని 3డిలో సినిమాను వీక్షించాలని అప్పుడే చాలా బావుంటుందని రజినీకాంత్ వివరణ ఇచ్చారు.  

click me!