తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

భార్యతో పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఫోజు.. వైరల్ అవుతున్న పిక్!

tirumala AN | Updated : Sep 06 2019, 06:09 PM IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కు ఉండే క్రేజే వేరు. పూరి తెరకెక్కించే చిత్రాలు ఎక్కువగా మాస్, యూత్ ని మెప్పిస్తుంటాయి. పూరి జగన్నాధ్ ఇటీవల రామ్ కథానాయకుడిగా, నిధి అగర్వాల్, నభా నటేష్ కథా నాయికలుగా తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయంగా నిలిచింది. 

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కు టాలీవుడ్ లో ప్రత్యేక స్థానం ఉంది. చాలా మంది స్టార్ హీరోలకు పూరి తిరుగులేని విజయాలు అందించారు. క్వాలిటీ అవుట్ పుట్ తో అత్యంత వేంగంగా చిత్రాలు తెరకెక్కించే దర్శకుడు పూరీనే అని చెప్పొచ్చు. కాగా ఇటీవల కొంతకాలం పూరి జగన్నాధ్ సరైన సక్సెస్ లేక సతమతమైన సంగతి తెలిసిందే. 

ఎట్టకేలకు పూరి ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో వరుస ఫ్లాప్స్ కి అడ్డుకట్ట వేశాడు. ఇటీవల రామ్ హీరోగా పూరి తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది. రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఈ చిత్రం నిలిచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 30 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. 

దీనితో పూరి మరింత ఉత్సాహంతో తన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. క్రేజీ హీరో విజయ్ దేవరకొండని పూరి డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

ఇదిలా ఉండగా శుక్రవారం పూరి, లావణ్య దంపతుల 23వ మ్యారేజ్ యానవర్సరీ. ఈ సందర్భంగా పూరి జగన్నాధ్ సోషల్ మీడియాలో తన భార్యని ఉద్దేశించి రొమాంటిక్ పోస్ట్ పెట్టాడు. తన భార్యని ముద్దుగా పండు అని పిలుస్తూ.. పండూ.. ఎప్పటికి నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అని కామెంట్ పెట్టాడు. తన భార్య లావణ్యని పూరి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉన్న పిక్ అభిమానులని ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియా వేదికగా ఈ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

 

click me!