వాళ్లని చంపేయండి.. పుల్వామా దాడిపై సినీ ప్రముఖుల ఆగ్రహం!

First Published Feb 15, 2019, 12:02 PM IST

వాళ్లని చంపేయండి.. పుల్వామా దాడిపై సినీ ప్రముఖుల ఆగ్రహం!

కశ్మీర్ లోని పుల్వామాలో గురువారం భద్రతా బలగాలపై ఉగ్రవాదుల దాడి జరిగిన సంగతి తెలిసిందే. 40 మంది జవానులు ఈ దాడిలో మరణించారు. ఇలాంటి దారుణమైన ఘటనపై సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదులను చంపేయండి అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.
undefined
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ 'మరో సర్జికల్ స్ట్రయిక్ కావాలని.. వారిని చంపేయండి' అంటూ ట్వీట్ చేశారు.
undefined
''మన వీరులకు ఎక్కడా రక్షణ లేదు. ఈ దాడి ఎంతో బాధకి గురి చేస్తోంది. దీనికి కారకులైన వారికి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాను'' అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు.
undefined
జవాన్ల పట్ల ఇంత దారుణం జరిగిందని తెలిసి చాలా బాధపడ్డాను. వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను అంటూ సూర్య పోస్ట్ పెట్టారు.
undefined
''ద్వేషం ఎప్పటికీ సమాధానం కాదని'' ప్రియాంక చోప్రా స్పందించింది
undefined
మన కుటుంబాలను కాపాడటానికి వారి ప్రాణాలను త్యాగం చేసిన జవాన్లను చూస్తుంటే గుండె బద్దలవుతుంది అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
undefined
''రాక్షసులు మళ్లీ చెలరేగిపోయారు. ఏ మాత్రం సహించకూడదని'' రితేష్ దేశ్ ముఖ్ అన్నారు.
undefined
''ప్రేమికుల రోజు జరుపుకుంటున్న వేళ ఇంత దారుణానికి ఒడిగట్టారు. వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు నా సంతాపం''
undefined
''ఎందఱో జవాన్ల ప్రాణాలను తీసి వారి కుటుంబాలకు బాధను మిగిల్చిన వారిని క్షమించజ్కూడదు. ఈ నష్టాన్ని తట్టుకునే శక్తిని దేవుడు వారికి ప్రసాదించాలని కోరుకుంటున్నాను''
undefined
click me!