నైట్ కర్ఫ్యూ తీసాకే: ‘లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ పై నిర్మాత మాట

By Surya PrakashFirst Published Jun 16, 2021, 5:18 PM IST
Highlights

అమిగోస్‌ క్రియేషన్స్‌పై తెరకెక్కిన ‘లవ్‌స్టోరీ’ కు శేఖర్ కమ్ముల  దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్‌పై కె నారాయణదాస్ నారంగ్, పి రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. ప‌వ‌న్ సంగీతాన్ని అందించారు. 

 టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో.. నాగ చైతన్య , సాయిపల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం ‘లవ్ స్టోరీ’.  ఈ సినిమా షూటింగ్  పూర్తై రిలీజ్ కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. మొదట ఫిక్స్ చేసిన ఏప్రిల్ 16 నుంచి మే నెలకు వాయిదా పడిన ఈ సినిమా.. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో విడుదల కాలేదు. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుతున్నట్లు కనిపిస్తుండటంతో ఆగస్టులో విడుదల చేయాలనే నిర్ణయానికి నిర్మాతలు వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తరువాత విడుదల కాబోయే పెద్ద సినిమా ఇదేనంటూ కథనాలు మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో నిర్మాత సునీల్ నారంగ్ ఈ సినిమా రిలీజ్ విషయమై క్లారిటీ ఇచ్చారు.

సునీల్ నారంగ్ మాట్లాడుతూ... తెలంగాణలో లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ.. నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది. రాత్రిపూట కర్ఫ్యూ పూర్తిగా తొలగించిన తరువాత మాత్రమే ఎవరైనా సినిమా రిలీజ్ విషయం ఆలోచిస్తారని.. మూడు షోలతో థియేటర్లు నడిపించడానికి ఎవరూ ముందుకు రారని అన్నారు. అలానే తెలంగాణతో పాటు ఏపీలో కరోనా పరిస్థితులు థియేటర్లు తెరవడానికి అనుకూలంగా ఉండాలి కదా.. అని చెప్పారు.

 అయితే ఇప్పుడున్న ట్రెండ్ ని చూస్తూంటే జూలై రెండో వారానికి పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నామని అన్నారు. ఒకవేళ థియేటర్లు తెరవటానికి ఫర్మిషన్స్  లభించినా.. నైట్ కర్ఫ్యూ తీసేసిన తరువాతే కొత్త సినిమాలు రిలీజ్ లు ఉంటాయని స్పష్టం చేశారు. ఏది ఏమైనా ‘లవ్ స్టోరీ’ సినిమా నైట్ కర్ఫ్యూ తీసిన వారం తరువాత విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చారు.
 
అమిగోస్‌ క్రియేషన్స్‌పై తెరకెక్కిన ‘లవ్‌స్టోరీ’ కు శేఖర్ కమ్ముల  దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్‌పై కె నారాయణదాస్ నారంగ్, పి రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. ప‌వ‌న్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి  తోపాటు రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
 

click me!