దీపికా పదుకొనె స్థానాన్ని కొట్టేసిన ప్రియాంక చోప్రా

By Aithagoni RajuFirst Published Aug 18, 2021, 9:24 AM IST
Highlights

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో పాగా వేస్తుంది. మరోసారి ఆమె బాలీవుడ్‌ సినిమా చేస్తుంది. అంతేకాదు ఇప్పుడు ప్రతిష్టాత్మక `మామి` ఛైర్‌ పర్సన్‌గా ఎంపికయ్యారు.

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె స్థానాన్ని గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా దక్కించుకుంది. ముంబై ఆకాడ‌మీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్‌(మామి)కి దీపికా ప‌దుకోన్ చైర్ ప‌ర్స‌న్‌గా వ్య‌వ‌హ‌రించారు. నాలుగు నెల‌ల క్రిత‌మే ఈ ప‌ద‌వి నుంచి దీపికా ప‌దుకోన్ త‌ప్పుకున్నారు. దీంతో ఆమె స్థానంలో ప్రియాంకని ఎంపిక చేశారు. మామి చైర్‌ పర్సన్‌గా ప్రియాంకకి అవకాశం ఇచ్చారు.

మామి బోర్డు స‌భ్యులుగా వ్య‌వ‌హ‌రిస్తున్న నీతా అంబానీ, అనుప‌మ చోప్రా, ఆనంద్ జీ మ‌హీంద్రా, అజ‌య్ బిజ్లీ, ఫ‌ర్హాన్ అక్త‌ర్‌, ఇషా అంబానీ, కిర‌ణ్ రావు, రానా ద‌గ్గుబాటి, క‌బీర్‌ఖాన్‌, కౌస్తుబ్ ధావ్సే, రితేశ్ దేశ్‌ముఖ్‌, రోహ‌న్ సిప్పి, జోయా అక్త‌ర్‌, విశాల్ భ‌ర‌ద్వాజ్‌, విక్ర‌మాదిత్య మోత్వానే, సిద్ధార్థ్ రాయ్ క‌పూర్ క‌లిసి త‌దుప‌రి చైర్ ప‌ర్స‌న్‌గా ప్రియాంక చోప్రాను ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. 

మామి స‌భ్యుల‌తో క‌లిసి ప‌నిచేయ‌డానికి తాను ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాన‌ని, చైర్ ప‌ర్స‌న్‌గా ఎన్నిక కావ‌డం ఆనందంగా ఉందని ప్రియాంక చోప్రా తెలిపారు. 2021 అక్టోబ‌ర్ నుంచి 2022 మార్చి వ‌ర‌కు జ‌ర‌గ‌బోయే మామి ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌ను మ‌రో స్థాయికి తీసుకెళ‌తాన‌ని ప్రియాంక చోప్రా పేర్కొన్నారు. 

ప్రియాంక ప్రస్తుతం హాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉంది. `మ్యాట్రిక్స్`, `టెక్ట్స్ ఫర్‌ యు` చిత్రాలు చేస్తుంది. ఇక బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తూ అలియా భట్‌, కత్రినా కైఫ్‌లతో కలిసి `జీ లే జారా` చిత్రంలో నటిస్తుంది. ఇది పూర్తిగా ఫీమేల్‌ మల్టీస్టారర్‌గా ఉండబోతుందట. ఫర్హాన్‌ అక్తర్‌ దీనికి దర్శకత్వం వహించనున్నారు.
 

click me!