ఒక ఇన్స్టా పోస్టుకు రూ.3 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. దీనితో ఇన్స్టాగ్రామ్ రిచ్లిస్ట్లో అత్యధిక పారితోషికం తీసుకునే భారతీయ నటిగా ప్రియాంక నిలిచింది.
అవును ప్రియాంక చోప్రా ఇనిస్ట్రాలో ఒక్క పోస్ట్ పెట్టడానికి మూడు కోట్లు వసూలు చేస్తుంది. ఈ మధ్యకాలంలో స్టార్స్ సినిమాల కన్నా కూడా సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా సంపాదిస్తున్నారు. పర్సనల్ విషయాలు, ప్రొఫెషనల్ విషయాలతో పాటు ఇంట్రస్టింగ్ పోస్ట్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో వారికి ఆదాయం కూడా బాగానే వస్తోంది. ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీలు ఏదైన యాడ్ ప్రమోట్ చేస్తే భారీ పారితోషికం అందుకుంటున్నారు.
ఇక సోషల్ మీడియాలో భారీగా యూజర్స్ ఉన్న వాటిల్లో ఇన్స్టాగ్రామ్ కూడా ఒకటి. అయితే ఇందులో ఫోటోలు, వీడియోలు లాంటివి పోస్ట్ చేయడమే కాకుండా డబ్బు కూడా సంపాదించొచ్చు. ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న సెలెబ్రిటీలంతా ఇప్పుడు ఈ సోషల్ మీడియా మీడియంలో అదే పనిలో ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న స్టార్స్ అంతా తమ ఖాతాలలో పలు యాడ్లను పోస్ట్ చేస్తూ సంపాదిస్తున్నారు. అయితే ఇందులో ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారు అనే విషయాన్నీ తాజాగా “హోపర్ హెచ్ క్యూ” విడుదల చేసింది. “ఇన్స్టాగ్రామ్ రిచ్ లిస్ట్-2021” అంటూ వారు రిలీజ్ చేసిన ఈ లిస్ట్ మన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా 27వ స్థానంలో నిలిచారు.
ఒక ఇన్స్టా పోస్టుకు రూ.3 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. దీనితో ఇన్స్టాగ్రామ్ రిచ్లిస్ట్లో అత్యధిక పారితోషికం తీసుకునే భారతీయ నటిగా ప్రియాంక నిలిచింది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకు 65 మిలియన్లు (ఆరున్నర కోట్లు) మంది ఫాలోవర్లు ఉన్నారు. అమెరికన్ వెబ్ డ్రామాలు, సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా ఇలా సంపాదన పెంచుకుంటూ పోతోంది. మన బాలీవుడ్ హీరోయిన్ ఒక్క పోస్ట్కి 8 నుండి పది లక్షలు తీసుకుంటారు. కాని ప్రియాంక మాత్రం 3 కోట్లు తీసుకొని షాకిస్తుంది. ప్రస్తుతం ప్రియాంక ‘టెక్ట్స్ ఫర్ యు ఇన్ లండన్’, ‘మ్యాట్రిక్స్4’ చిత్రాల్లో నటిస్తోంది.