నేషనల్‌ అవార్డులు వస్తే కలిసి రారా?.. టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు, డైరెక్టర్లకి ప్రకాష్‌ రాజ్‌ చురకలు..

 అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డు వస్తే అందరు తెలుగు హీరోలకు అవార్డు వచ్చినట్టే అని, కానీ దాన్ని సెలబ్రేట్‌ చేసుకునేందుకు కలిసి రావడం లేదు ఎందుకు అని ప్రశ్నించారు ప్రకాష్‌ రాజ్‌.

Google News Follow Us

జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌(Allu Arjun) ఇటీవల నేషనల్‌ అవార్డు(National Award) అందుకున్న విషయం తెలిసిందే. బెస్ట్ యాక్టర్‌గా జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడిగా బన్నీ రికార్డు సృష్టించారు. మూడు రోజుల క్రితమే ఢిల్లీలో ఈ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ వేడుక వేడుక జరిగింది. బన్నీ, దేవిశ్రీప్రసాద్‌, చంద్రబోస్‌, రాజమౌళి, డీవీవీ దానయ్య, ఇతర టెక్నీషియన్లు, నిర్మాతలు జాతీయ అవార్డులు అందుకున్నారు. పది జాతీయ అవార్డులు టాలీవుడ్‌కి రావడం ఇదే మొదటిసారి. 

దీంతో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ జాతీయ అవార్డులు సాధించిన వారిని అభినందిస్తూ సెలబ్రేషన్‌ నిర్వహించింది. శనివారం రాత్రి గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేశారు. ఇందులో నటుడు ప్రకాష్‌ రాజ్‌ (Prakash Raj) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది తెలుగు చిత్ర పరిశ్రమ(టీఎఫ్‌ఐ) గొప్పతనమని తెలిపారు. తెలుగు నటుడికి మొదటిసారి జాతీయ అవార్డు వచ్చింది. ఇది సెలబ్రేట్‌ చేసుకునే టైమ్‌. అల్లు అర్జున్‌కి వస్తే, ఇది అందరు నటులకు వచ్చినట్టే అని, దాన్ని సంభ్రమించాలని తెలిపారు. 

అయితే అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డు వస్తే అందరు తెలుగు హీరోలకు అవార్డు వచ్చినట్టే అని, కానీ దాన్ని సెలబ్రేట్‌ చేసుకునేందుకు కలిసి రావడం లేదు ఎందుకు అని ప్రశ్నించారు. అలాగే రాజమౌళి `ఆర్‌ఆర్‌ఆర్‌` తో ఆస్కార్‌కి వెళ్లారు. ఈ సినిమాకి జాతీయ అవార్డు వచ్చాయి, ఈ సంతోషాన్ని సెలబ్రేట్‌ చేసుకునేందుకు స్టార్‌ డైరెక్టర్లు రావడం లేదు ఎందుకు అని ప్రశ్నించారు. 25ఏళ్ల క్రితం తనకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు అప్పుడు సంభ్రమించడానికి ఎవరూ లేరని, కానీ ఇప్పుడు మైత్రీ వాళ్లు ఈ కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. 

తెలుగు సినిమా పాన్‌ ఇండియాకి వెళ్లింది. గ్లోబల్‌ స్థాయిలో సత్తా చాటుతున్న తరుణంలో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అంతా కలిసి వస్తే బాగుంటుందని, మనల్ని మనమే ప్రోత్సహించకపోతే ఎలా అని ప్రకాష్‌ రాజ్‌ అన్నారు. టాలీవుడ్‌ పెద్దలు, స్టార్‌ డైరెక్టర్లకి ఆయన పరోక్షంగా చురకలు అంటించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బన్నీపై ప్రశంసలు కురిపించారు. తనని చిన్నప్పట్నుంచి చూస్తున్నానని, షూటింగ్‌ లొకేషన్‌లో వచ్చిన సైలెంట్‌గా కూర్చొనే వాడని, అప్పట్లోనే ఆ స్పార్క్ చూశానని, పైకి తీసుకురావాలని అల్లు అరవింద్‌కి చెప్పినట్టు తెలిపారు. బన్నీ తనని తాను మౌల్డ్ చేసుకున్న నటుడు అని తెలిపారు. అంతేకాదు ఇప్పుడు కలిసినప్పుడు ఇది కాదు, ఇంకా మున్ముందు మరింతగా రీచ్‌ కావాలి, ఇంకా చాలా చేయాలి అని తనతో చెప్పాడని, అది ఒక నటుడికి ఉండాల్సిన స్పిరిట్‌ అని కొనియాడారు ప్రకాష్‌. జాతీయ అవార్డు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు.
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!