వెండితెర మదర్‌కి హైదరాబాద్‌ స్వీట్స్ తో సర్‌ప్రైజ్‌ చేసిన ప్రభాస్‌

By Aithagoni RajuFirst Published Jul 2, 2021, 4:56 PM IST
Highlights

ప్రభాస్‌ సీనియర్‌ నటి భాగ్యశ్రీని సర్‌ప్రైజ్‌ చేశారు. తెలుగు రుచులు చూపించారు. ఆమెకి హైదరాబాదీ స్వీట్లని గిఫ్ట్ గా పంపించి మనసుని దోచుకున్నాడు.

ప్రభాస్‌ సీనియర్‌ నటి భాగ్యశ్రీని సర్‌ప్రైజ్‌ చేశారు. తెలుగు రుచులు చూపించారు. ఆమెకి హైదరాబాదీ స్వీట్లని గిఫ్ట్ గా పంపించి మనసుని దోచుకున్నాడు. ప్రభాస్‌, సీనియర్‌ నటి భాగ్య శ్రీ కలిసి `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో భాగ్య శ్రీ ప్రభాస్‌కి తల్లి పాత్రలో కనిపించబోతుండటం విశేషం. ఈ విషయాన్ని భాగ్యశ్రీ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఆయనతో వర్క్ ఎక్స్ పీరియెన్స్ ని షేర్‌ చేసుకుంది. అంతేకాదు షూటింగ్‌ సెట్‌లో ప్రభాస్‌ తన ఇంటి నుంచి ప్రత్యేకంగా వండించిన వంటకాలను రుచి చూపించినట్టు తెలిపింది భాగ్యశ్రీ. 

తాజాగా పూతరేకులు భాగ్యశ్రీకి గిఫ్ట్ గా పంపించాడట. ఈ విషయాన్ని తెలియజేస్తూ భాగ్యశ్రీ ట్వీట్‌ చేసింది. `ఎంతో రుచికరమైన, కమ్మనైన హైదరాబాదీ స్వీట్లు అందాయి. థ్యాంక్స్ ప్రభాస్‌. మొత్తానికి నా అభిరుచినే మార్చేశావు` అని ట్వీట్‌ చేసింది. ఆ స్వీట్ల ప్యాకెట్లని ఫోటో తీసి పంచుకుంది. దీంతో ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న `రాధేశ్యామ్‌`లో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఇందులో విక్రమాదిత్య అనే పాత్రలో ప్రభాస్‌ కనిపించనున్నారు. ఈ సినిమా కరోనా అనంతరం మళ్లీ షూటింగ్‌ ప్రారంభించుకుంది. దసరాకి దీన్ని రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌.

click me!