కసిగా ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్, ట్రెండింగ్ లో 'స్పిరిట్'.. కారణం ఏంటంటే..

By team teluguFirst Published Dec 25, 2022, 6:22 PM IST
Highlights

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలితో దేశవ్యాప్తంగా అభిమానులని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఇండియాలోనే టాప్ మోస్ట్ హీరోలలో ఒకరు అని చెప్పడంలో సందేహం లేదు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలితో దేశవ్యాప్తంగా అభిమానులని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఇండియాలోనే టాప్ మోస్ట్ హీరోలలో ఒకరు అని చెప్పడంలో సందేహం లేదు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె లాంటి పాన్ ఇండియా చిత్రాల్లో ప్రభాస్ నటిస్తున్నాడు. 

ఇటీవల మారుతి దర్శకత్వంలో ప్రభాస్ కొత్త చిత్రాన్ని కూడా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఆదిపురుష్ సంక్రాంతికి రిలీజ్ అయి ఉండేది. కానీ టీజర్ కి వచ్చిన నెగిటివ్ రెస్పాన్స్  చిత్ర యూనిట్ ని ఆలోచనలో పడేసింది. దీనితో వచ్చే ఏడాది జూన్ కి ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఇది ఫ్యాన్స్ కి పెద్ద షాక్ అనే చెప్పాలి. 

ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు కాకుండా ప్రభాస్ 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించేందుకు కూడా కమిట్ అయ్యారు. వీరిద్దరి కాంబినేషన్ లో 'స్పిరిట్' అనే చిత్ర ప్రకటన కూడా జరిగింది. సలార్, ఆదిపురుష్ రిలీజ్ కావాలి.. ప్రాజెక్ట్ కె కంప్లీట్ కావాలి.. ఆ తర్వాతే స్పిరిట్ ఉంటుంది. కానీ అనూహ్యంగా నేడు స్పిరిట్ చిత్రం ట్రెండింగ్ లోకి వచ్చింది. 

ప్రభాస్ అభిమానులంతా ఎంత కసిగా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పోస్ట్ లు చూస్తే అర్థం అవుతుంది. స్పిరిట్ చిత్రం ట్రెండింగ్ గా మారడానికి కారణం ఉంది. నేడు సందీప్ రెడ్డి వంగా పుట్టినరోజు. ప్రభాస్ ఇంస్టాగ్రామ్ లో ఈ క్రేజీ డైరెక్టర్ కి బర్త్ డే విషెష్ కూడా తెలిపాడు. 

సందీప్ వంగా 'అర్జున్ రెడ్డి' లాంటి కల్ట్ మూవీ అందించి తన ప్రత్యేకత చాటుకున్నారు. దీనితో స్పిరిట్ చిత్రంలో కూడా ప్రభాస్ ని వైవిధ్యంగా చూపిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందుకే ఈ చిత్రం కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. సందీప్ ప్రస్తుతం రణబీర్ కపూర్ తో 'యానిమల్' అనే మూవీ తెరకెక్కిస్తున్నారు. 

click me!