పెంచుకుంటూ పోతే పెరిగేది బడ్జెట్టే కానీ బిజినెస్ కాదు అని ప్రభాస్ తన స్నేహితులైన నిర్మాతలు యువి క్రియోషన్స్ వారిని హెచ్చరిస్తున్నారట. అయినా వాళ్లు బాహుబలి తర్వాత వస్తున్న ‘సాహో’ చిత్రంకి ఆ మాత్రం క్రేజ్ ఉంటుందని షెడ్యూల్ ..షెడ్యూల్ కు బడ్జెట్ ని పెంచేసి నీళ్లులా డబ్బు పోస్తున్నారని టాక్.
పెంచుకుంటూ పోతే పెరిగేది బడ్జెట్టే కానీ బిజినెస్ కాదు అని ప్రభాస్ తన స్నేహితులైన నిర్మాతలు యువి క్రియోషన్స్ వారిని హెచ్చరిస్తున్నారట. అయినా వాళ్లు బాహుబలి తర్వాత వస్తున్న ‘సాహో’ చిత్రంకి ఆ మాత్రం క్రేజ్ ఉంటుందని షెడ్యూల్ ..షెడ్యూల్ కు బడ్జెట్ ని పెంచేసి నీళ్లులా డబ్బు పోస్తున్నారని టాక్.
అయితే ఇలా బడ్జెట్ పెరిగిపోతే ఆ సినిమా మెగా హిట్ అయితే కానీ రికవరీ అవదని, లాభాల్లో పడాలంటే చాలా కష్టపడాల్సి వస్తుందని ప్రభాస్ చెప్తున్నారని తెలుస్తోంది. అలాగే సినిమా ఏ మాత్రం అంచనాలకు దగ్గరగా లేకపోయినా ఫ్యాన్స్ నిరాశపడతారని, అప్పుడు అది కలెక్షన్స్ పై చూపెడుతుందని తనపై మోయలేని భారం పెట్టవద్దని కోరుతున్నాడట.
అందుకు కారణం ఇప్పటికే 250 కోట్లు దాకా ఈ సినిమాపై పెట్టుబడి పెట్టారట. ఇంకో యాభై కోట్లు దాకా అయ్యేటట్లు ఉందని అంచనా వేస్తున్నారట. గత కొద్ది వారాలుగా ఈ బడ్జెట్ మరీ పెరిగిపోయిందిట. దర్శకుడు, నిర్మాత ఓవర్ కాన్ఫిడెన్స్ తో డబ్బులు ఖర్చు పెడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. దగ్గర నుంచి గమనిస్తున్న ప్రభాస్ ఈ విషయమై హెచ్చరికలు జారీ చేస్తున్నా..వారు లైట్ తీసుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
ఇక ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఆ రోజునే రిలీజ్ కు ఎంచుకోవటానికి కారణం..ఆ రోజు దేశం మొత్తం శెలవు రోజు అనేది ఓ కారణం అయితే సినిమాలో దేశభక్తికి సంభందించిన కొన్ని ఎలిమెంట్స్ మిళితం కావటం వల్ల కూడా ఆ రోజుని ఫిక్స్ చేసారని తెలుస్తోంది.
ఇందులో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. శంకర్-ఎహసాన్- లాయ్ త్రయం, తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. నీల్ నితిన్ ముఖేశ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, ఎవ్లిన్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.