పోసాని, పృధ్వీల పొలిటికల్ సెటైర్.. చంద్రబాబే టార్గెట్!

By Udayavani DhuliFirst Published Jan 20, 2019, 11:41 AM IST
Highlights

ప్రముఖ రచయిత పోసాని కృష్ణమురళి, కమెడియన్ పృధ్వీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టర్స్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమయం దొరికినప్పుడల్లా వీరిద్దరూ వైకాపా తరఫున బలంగా మాట్లాడుతూనే ఉంటారు. 

ప్రముఖ రచయిత పోసాని కృష్ణమురళి, కమెడియన్ పృధ్వీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టర్స్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమయం దొరికినప్పుడల్లా వీరిద్దరూ వైకాపా తరఫున బలంగా మాట్లాడుతూనే ఉంటారు.

ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ రాజకీయ చిత్రం రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు. సెటైర్లు వేయడంలో పోసాని సిద్ధహస్తుడు. గతంలో కూడా ఆయన కొన్ని సెటైరికల్ సినిమాలను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈసారి వర్తమాన రాజకీయాల ఆధారంగా పొలిటికల్ సెటైర్ కథను రూపొందిస్తున్నాడు.

ఈ సినిమాలో పోసానితో పాటు పృధ్వీ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ వారంలోనే సినిమా షూటింగ్ మొదలుకానుంది. పోసాని నటిస్తూ దర్శకత్వం వహించే ఈ సినిమాలో చంద్రబాబుని టార్గెట్ చేస్తారని టాక్. సినిమా వివరాలు బయటకి తెలియనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మొదట జగన్ మీద ఈ సినిమా ఉంటుందనే వార్తలు వినిపించాయి. కానీ ఇది జగన్ సినిమా మాత్రం కాదట. పూర్తిగా చంద్రబాబు పాలనపై సెటైరికల్ గా నడిచే సినిమా అని తెలుస్తోంది. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు, అందులో వేటిని సంక్రమంగా ఆచరిస్తున్నారనే విషయాలను ఇందులో చూపించబోతున్నారు. 
 

click me!